Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

0
354

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు 

ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు

ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 

 

 

 

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 62
Arunachal Pradesh
Border Infrastructure Development Driving Arunachal Growth
Border Infrastructure Development has become a key focus in Arunachal Pradesh, enhancing...
By Fathima Safa 2026-06-23 12:01:50 0 116
Telangana
మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల...
By Sidhu Maroju 2026-02-01 10:34:19 0 186
Andhra Pradesh
ఎన్టీఆర్ జయంతి .. ఘన నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్.
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కుటుంబసభ్యుల ఘన నివాళి ఆయన ఆధునిక సంఘ సంస్కర్త అని కొనియాడిన సీఎం...
By Pagadala Venkateswar 2026-05-28 07:17:43 0 67
Gujarat
New Govt Push: Protecting Eco-Sensitive Zones in India
he central government is accelerating the identification of Environmentally Sensitive Areas (ESA)...
By Lokeshwari Panthadi 2026-07-01 06:37:36 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com