Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.

0
351

14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు 

ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల కేటాయింపు

ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్ల కేటాయింపు

రాజధాని అమరావతి ప్రాంత రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. అమరావతి ప్రాంత రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు జరగనుంది. గతంలో మాదిరిగానే ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయించబోతున్నారు. దీనికి సంబంధించి సీఆర్డీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు మొత్తం 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు 135 ప్లాట్లు కేటాయించనున్నారు. ఈ-లాటరీని ఈ రోజు ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించనున్నారు. 

 

 

 

 

అలాగే, ఉండవల్లిలో మెట్ట భూములు ఇచ్చిన రైతులకు కూడా ప్లాట్లు ఇవ్వనున్నారు. అక్కడి 201 మంది రైతులకు మొత్తం 390 ప్లాట్లు కేటాయించనున్నారు. ఉండవల్లి రైతుల కోసం మధ్యాహ్నం 3 గంటలకు ఈ-లాటరీ నిర్వహిస్తారు. మరోవైపు, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఒకవైపు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూనే, మరోవైపు భవిష్యత్ అవసరాలు, విస్తరణ కోసం భూ సేకరణ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్లాట్ల కేటాయింపు జరగడం అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగుగా భావిస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:57 0 39
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
By Pagadala Venkateswar 2026-03-03 04:04:08 0 166
Telangana
కరీంనగర్ : పోలీస్ శాఖలో రూ 1.40 కోట్ల జీతాల కుంభకోణం..
కరీంనగర్ జిల్లాలో మరణించిన పోలీసు కానిస్టేబుళ్ల పెర్లతో జీతాలు డ్రా చేస్తున్న భారీ కుంభకోణం...
By Sunka Santhosh 2026-04-09 17:47:09 0 216
Delhi - NCR
MeitY Grills WhatsApp, Signal on Usernames & Security
The Ministry of Electronics and Information Technology (MeitY) has escalated its regulatory...
By Lokeshwari Panthadi 2026-07-03 06:32:36 0 46
SURAKSHA
C. Lalsawivunga, IAS: Driving Progress Through Governance
The Journey begins "The strength of a nation lies not only in its policies but...
By Fathima Safa 2026-07-21 11:14:40 0 38
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com