కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్

0
98

కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క.

‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా పని చేశారు.

‎నాజీలా (నియంతలా) పదేళ్లు తెలంగాణ ప్రజలను అణిచివేసారు.

‎అందుకే ప్రజలు 2023 ఎన్నికల్లో అధికారం నుంచి దించేశారు.

‎కనీసం ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా చేయడం లేదు.

‎అందుకే మీరు మీటింగ్ అన్న, ధర్నాలు అన్న ప్రజలు ఎవరు రావడం లేదు.

‎అందుకే బీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరిగిపోయింది, 

‎ఆవేశంతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. 

‎మిగులు బడ్జెట్ తో రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే , రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు . 

‎తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు 72 వేల కోట్లుంటే , 10 ఏళ్లలో అప్పులను 7 లక్షలకోట్ల కు తీసుకెళ్లారు . 

‎మీరు చేసిన అప్పులకు అసలు , వడ్డీ కలిపి నెలకు 6 వేల కోట్లు మేము బ్యాంకులకు వడ్డీ కడుతున్నాము . 

‎మీరు చేసిన అప్పు 2 లక్షల 80 వేల కోట్లని పచ్చి అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు .

‎ ‎ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసమే 1 లక్ష కోట్లు అప్పులు తెచ్చారు . 

‎ఈ అప్పు ఏ విధంగా తీరుస్తారని బ్యాంకులు అడిగితే , కాళేశ్వరం నీళ్లు అమ్మి తీరుస్తామని చెప్పి అప్పు తెచ్చిన ఘనులు మీరు . 

‎కూలిపోయి చుక్క నీరు రాని కాళేశ్వరం నీళ్లు ఏ విధంగా అమ్మి అప్పు తీర్చాలో కేటీఆర్ సమాధానం చెప్పాలి . 

‎కాలం చెల్లిన టెక్నాలజీ తో మీరు కట్టిన యాదాద్రి , భద్రాద్రి ధర్మల్ స్టేషన్లలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరిగి పోయి రాష్ట్రానికి గుదిబండలుగా మారాయి .

‎ అదీకాక , బొగ్గుగనులున్న ప్రాంతానికి దూరంగా ధర్మల్ స్టేషన్స్ కట్టడంతో , బొగ్గు రవాణా ఖర్చు తడిసి మోపెడవుతున్నది .

‎ బాధ్యతలేని, చేతగాని పాలన సాగించారు . 

‎ప్రజల సొమ్ముకాబట్టి ఇష్టానుసారం ఖర్చుపెట్టి దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు అవి ప్రజల నెత్తిన గుదిబండలుగా మారిపోయాయి . లక్ష కోట్లతో మీరు కట్టిన కాళేశ్వరం రెండేళ్లలో కూలిపోయి మొండిగోడలతో వెక్కిరిస్తున్నది .

‎ దీనికి సిగ్గుపడాల్సింది పోయి , గొప్ప ఘనకార్యం చేసినట్లు కాళేశ్వరం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్నారు .

‎పార్టీ వర్కింగ్ పెసిడెంట్ పదవి నీకు ఇస్తే , అప్పుడు వర్కింగ్ ముఖ్యమంత్రిగా , ఇప్పుడు వర్కింగ్ ప్రతిపక్షనాయకుడిగా చలామణి అవుతున్నావు . 

‎త్రీ ట్రిలియన్ లో ఎన్ని సున్నాలున్నాయో రేవంత్ రెడ్డి కి తెలియదంటున్నారు . 

‎అధికారంలో ఉన్నప్పుడు పొద్దున్న లేచింది మొదలు కుంభకోణాలు చేసి వేల కోట్లు కొట్టి వేసిన వాడివి .

‎దోపిడీలకు పాల్పడినవాడివి . కోట్లు , మిలియన్ల , ట్రిలియన్ల లెక్కలు బాగాతెలిసిన వాడివి . 

‎ఏ లెక్కకు ఎన్ని సున్నాలున్నాయో నీకు బాగా తెలుసు . కోట్లు లెక్కపెట్టి , పెట్టి నీ చేతులు నెప్పి పుడుతుండాలి . 

‎పదేళ్లు అసమర్థ పాలన అందించిన బీఆర్ఎస్ నేతలు... ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా నిర్వహించలేకపోతున్నారు.

‎అందుకే వాళ్ల మీటింగ్ లు అన్న, ధర్నాలు అన్న ప్రజలు వచ్చే పరిస్థితి లేదు.

‎ఈ విషయాన్ని స్వయంగా వాళ్ల నాయకులే బయటకు చెబుతున్నారు.

‎ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మాట్లాడక పోతే.... ప్రజలు ఈ యింత పదవులు కూడా ఊదగొడుతారు.

‎దమ్ముంటే.... ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి ఉంటే... సభా వేదికగా చరచుకు సిద్ధం.

‎మీరంతా ప్రతిపక్ష నాయకుడితో సభకు రండి, చర్చకు సిద్ధం.

Search
Categories
Read More
Telangana
హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు
కమిషన్ ఏర్పాటు సరైందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది ,నోటీసుల అంశం కేవలం టెక్నికల్ మాత్రమే...
By Ponnala Srinivasrao 2026-04-24 00:30:53 0 124
Andhra Pradesh
తాళం వేసి మూసి ఉన్న ఇళ్ల భద్రత కోసం పోలీసు వారు ఉచితంగా అందించే సీసీ కెమెరాలు(LHMS) ఉపయోగించుకోవాలని అంటున్న గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
  >kvsr. కోటేశ్వరరావు. గుంటూరు.    *గుంటూరు జిల్లా పోలీస్...*...
By KOTESWARARAO KVSR 2026-01-12 09:44:12 0 613
Andhra Pradesh
ఆయి శెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
గుంటూరు నగరంలోని నెహ్రు నగర్56వ డివిజన్ కార్పొరేటర్ ఆయి శెట్టి కనకదుర్గ శ్రీనివాస్ మార్కెట్...
By John Baji 2025-12-31 01:40:03 0 180
Telangana
మంచిర్యాల 50 డివిజన్లో కొనసాగుతున్న శుభ్రత - ప్రతి ఒక్కరి బాధ్యత కార్యక్రమం
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్...
By Avunoori Mahesh 2026-04-18 06:50:57 0 170
Andhra Pradesh
లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
*Press Release*   *లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి*   *వేగం మరింత...
By Rajini Kumari 2026-04-04 14:54:24 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com