ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం

0
141

*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*

 

*కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు తధ్యం*

 

*టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పాల మాధవ్*

 

*ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాల‌యంలో రెంట‌ప‌ల్లి శ్యామ్ కి స‌న్మానం*

 

*ఇటీవ‌ల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్ నియామ‌కం*

 

విజ‌య‌వాడ : కష్టపడి పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు తధ్యం అని టిఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విజయవాడ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు పాల మాధవ్ అన్నారు. టిడిపి అనుబంధ టిఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇటీవల ఏపీ మినియం వేజేస్ అడ్వయిజరీ బోర్డు డైరెక్టర్‌గా నియమితులైన రెంటపల్లి శ్యామ్‌కు టిఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు.

 

 పశ్చిమ నియోజకర్గంలో ఉన్న విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల మాధవ్ ముందుగా నూతనంగా రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్‌గా నియమితులైన శ్యామ్‌ను సత్కరించి అభినందనలు తెలిపారు. కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు టిడిపి పార్టీలోనే సాధ్యమన్నారు. టిఎన్‌టీయూసీలో బాధ్యతాయుంతంగా పనిచేస్తూ కార్మికుల సంక్షేమం దిశగా కష్టపడి పనిచేసిన శ్యామ్‌కు పార్టీ నాయకత్వం పదవిని అప్పగించడం జరిగిందని వివరించారు.

 

తనకు పదవి వచ్చేందుకు సహకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)కు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకత్వంకు శ్యామ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు కొట్టేటి హనుమంతరావు, కామా దేవరాజ్, టీఎన్‌టీయూసీ పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షులు బాస్కర్, పశ్చిమ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పైడిమాల సుభాషిణి, విజ‌య‌వాడ అర్బ‌న్ ఎస్సీ సెల్ మాజీ అధ్య‌క్షుడు జీవీ న‌ర‌సింహారావు, విజ‌య‌వాడ మార్కెట్ యార్డ్ డైరెక్ట‌ర్ మైల‌ప‌ల్లి రాజు, నాయకులు చిల్లా వెంకటేష్, పద్మ, రాజు, సీతారామయ్య, విజ‌య్ ల‌తో పాట‌ తదితరులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు:  ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్...
By Hari Krishna 2025-12-24 14:38:55 0 191
Andhra Pradesh
మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.
మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై...
By Pagadala Venkateswar 2026-04-29 04:59:31 0 58
Telangana
వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు
26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి...
By MERIGE MALLESH 2026-03-26 07:18:49 0 222
Telangana
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
By Katiyala JeevanRaj 2026-03-14 03:37:13 1 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com