Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.

0
178

పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం

13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు హర్షం

ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్

మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ సహా పలువురికి పద్మశ్రీ

ఈ పురస్కారాలు అందరికీ స్ఫూర్తి కావాలని ఆకాంక్ష

2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు శుభాకాంక్షలు చెబుతూ, ముఖ్యంగా 13 మంది తెలుగు వారికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు.

 

ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ పురస్కారం లభించడం గర్వకారణమని చంద్రబాబు అన్నారు. అదేవిధంగా, పద్మశ్రీ పురస్కారాలు పొందిన వారందరికీ ఆయన పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. విజేతలలో యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ ఉన్నారు.

 

ఇంకా సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్, గడ్డమనుగు చంద్రమౌళి... వైద్య రంగంలో పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, గూడూరు వెంకట్రావు... సాహిత్య రంగంలో వెంపటి కుటుంబ శాస్త్రి... నృత్యంలో దీపికారెడ్డిలకు అభినందనలు తెలిపారు. మరణానంతరం పద్మశ్రీ పొందిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), రామారెడ్డి మామిడి (పశుసంవర్ధక)ల సేవలను కూడా సీఎం స్మరించుకున్నారు.

 

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించి తెలుగు జాతి ఖ్యాతిని మరింతగా వెలిగించిన ఈ ప్రముఖుల విజయాలు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు

Search
Categories
Read More
Telangana
మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..
మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా...
By Ponnala Srinivasrao 2026-04-14 01:51:37 0 157
Andhra Pradesh
కాకినాడను కుదిపేసిన భీకర విస్ఫోటనం వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు – 23 మంది మృతి రూ.20 లక్షల రాష్ట్ర పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా:శనివారం మధ్యాహ్నం 2 గంటల 5 నిమిషాల సమయంలో...
By Ratna Sekhar 2026-02-28 18:16:40 0 1K
Andhra Pradesh
పుంగనూరు: భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పుంగనూరు మండల సమీపంలో గల పెద్దపంజాని మండలం, కొలుత్తూరు పంచాయతీ గుండపల్లి గ్రామంలో గురువారం భూ...
By Kothuru Murali 2026-03-20 06:32:10 0 155
Ladakh
Ladakh Launches Community Solar Greenhouses in Remote Villages
The Union Territory of Ladakh has introduced community solar greenhouses across several...
By Bharat Aawaz 2025-07-17 06:37:13 0 1K
Telangana
"స్మశానవాటికలో చేత్తెంటి!.. తక్షణమే తరలించండి :"JAC అల్టిమేటం. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త...
By Sidhu Maroju 2026-02-05 13:24:25 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com