₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|

0
64

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.

శనివారం పగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం వద్ద గంజాయి కొనుగోలుదారుడి కోసం ఎదురు చూస్తుండగా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద నుంచి రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు.. గణేష్ శివనాథ్ బోడుగే (42)పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33)విన్నీ శైలేష్ మేశారాం (32)ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54)

వీరు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం… తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో కిలోకు రూ.4,000కు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12,000 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
అయేషా మీరా తల్లిదండ్రుల వినతి పత్రం
తమ కుమార్తె ఆయేషా మీరా పేరుతో విద్యా సంస్థను నెలకొల్పి డిసెంబర్ 27వ తేదీన సంస్మరణ దినోత్సవం...
By Rajini Kumari 2025-12-27 11:06:49 0 149
Telangana
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్...
By Veeresh Kumar 2026-03-30 06:21:47 0 147
Andhra Pradesh
నారావారిపల్లె నారావారి ఇంటిదగ్గర విషాద ఘటన
సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ వృద్దుడు ఆత్మహత్యాయత్నం   నారావారిపల్లె సీఎం ఇంటి ఎదుట...
By Rajini Kumari 2026-01-14 12:25:11 0 114
Andhra Pradesh
తిరుమలలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,...
By Kothuru Murali 2025-12-30 12:44:14 0 123
Telangana
వైభవంగా శ్రీ గుంజేడు ముసలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
​- పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి డాక్టర్ సీతక్క ​ మహబూబాబాద్/కొత్తగూడ, ఫిబ్రవరి 16(భారత్...
By Bittu Bittu 2026-02-16 13:35:28 0 425
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com