₹. 50 లక్షల విలువైన గంజాయి పట్టివేత – నలుగురు అరెస్ట్.|

0
237

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. మొత్తం 42.9 కిలోల గంజాయితో పాటు రూ.72,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, కాకినాడ ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి సరఫరా చేయాలనే ప్లాన్ చేశారు. ఇందుకోసం నలుగురు నిందితులు గంజాయిని నాలుగు బ్యాగుల్లో పెట్టుకొని కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైల్లో సికింద్రాబాద్‌కు తీసుకువచ్చారు.

శనివారం పగలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ వర్క్స్ కార్యాలయం వద్ద గంజాయి కొనుగోలుదారుడి కోసం ఎదురు చూస్తుండగా, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ చంద్రశేఖర్ గౌడ్ నేతృత్వంలోని బృందం వారిని అదుపులోకి తీసుకుంది.

నిందితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా 20 గంజాయి పాకెట్లు లభించాయి. వాటిని తూకం వేయగా 42.9 కిలోలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ వద్ద నుంచి రూ.72,500 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన నిందితులు.. గణేష్ శివనాథ్ బోడుగే (42)పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33)విన్నీ శైలేష్ మేశారాం (32)ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54)

వీరు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు గుర్తించారు.

విచారణలో నిందితులు తెలిపిన వివరాల ప్రకారం… తుని, నర్సీపట్నం ప్రాంతాల్లో కిలోకు రూ.4,000కు గంజాయిని కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో రూ.12,000 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.

ఈ ఆపరేషన్‌లో సీఐ చంద్రశేఖర్ గౌడ్, కోటమ్మ, ఎస్సైలు శ్రీనివాసులు, రూప, భూపాల్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి అభినందించారు.

#sidhumaroju 

Alwal

Search
Categories
Read More
Telangana
కనబడుటలేదు... ఆచూకీ తెలిపినవారికి 50000 వేల రూపాయల బహుమతి.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజుపల్లి గ్రామానికి చెందిన బంజా రవి (35) తేదీ 06/01/2026 ఉదయం...
By Gangaram Rangagowni 2026-01-13 10:39:12 0 233
Telangana
ట్రూ వేల్యూ షోరూమ్ లో అగ్నిప్రమాదం .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని ట్రూ వ్యాల్యూ షో రూమ్ లో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల...
By Sidhu Maroju 2026-01-14 09:54:04 0 285
Andhra Pradesh
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-05-22 14:18:09 0 35
Andhra Pradesh
పుంగనూరు: అక్రమ సంబంధం వల్లే హత్య: సీఐ కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-04-10 04:42:30 0 80
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:16:43 0 515
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com