వ్యాపారులకు ఆర్థిక భరోసా రుణాలు అందజేసిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
180

కర్నూలు : నంద్యాల : డోన్ 

డోన్ పట్టణంలో PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా – 270 మందికి రూ.45.30 లక్షల రుణాలు మంజూరు

డోన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్లబ్ హౌస్‌లో ఈ రోజు డోన్ మెప్మ (MEPMA) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో అమలవుతున్న PM–SVANidhi 2.0 పథకం ద్వారా వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి అందుతున్న సహాయంపై అవగాహన కల్పించారు. ఈ పథకం కింద డోన్ పట్టణంలో మొత్తం 270 మంది వీధి వ్యాపారులకు రూ.45,30,000/- (అక్షరాలా రూపాయలు నలభై ఐదు లక్షల ముప్పై వేల మాత్రమే) రుణాలు మంజూరైనట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి* గారు మాట్లాడుతూ, చిన్న వ్యాపారులు మరియు వీధి వ్యాపారులు స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం PM–SVANidhi 2.0 పథకాన్ని ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధనం లభించి, వ్యాపారుల జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

డోన్ పట్టణంలో అర్హులైన మరింత మంది వీధి వ్యాపారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గారు కోరారు. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన మరియు రుణ మంజూరు ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయడంలో మున్సిపల్ శాఖ, మెప్మ సిబ్బంది ప్రజల పక్షాన నిలబడి పూర్తి సహకారం అందిస్తారని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో భాగంగా వీధి వ్యాపారుల చేతికి క్రెడిట్ కార్డులు అందించగా, పథకం ద్వారా మంజూరైన రుణాల విలువను ప్రతిబింబించే మెగా చెక్‌ను ఎమ్మెల్యే గారు ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మెప్మ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు వీధి వ్యాపారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మానవత్వం చాటుకున్న నందవరం యూత్
 నందవరం మండల కేంద్రంలోని వన్యప్రాణాలపై మానవత్వం చాటుకున్న నందవరం యువకులు నందవరం పూలు చింత...
By Boya Dasthagiri 2026-05-19 12:43:22 0 91
Andhra Pradesh
జోరుగా కోడి పందాలు కోర్టు తీర్పును ధిక్కరించిన అధికారులు
Avja Ntr... కృష్ణా    _*జోరుగా కోడి పందాలు*_   *_కోర్టు తీర్పును లెక్క చేయని...
By Rajini Kumari 2026-01-14 12:32:20 0 137
Telangana
జర్నలిస్ట్ సాంబా పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : డీజీపీని కలిసిన టియుడబ్ల్యూజే నేతలు
 హైదరాబాద్:    ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను...
By Sidhu Maroju 2025-09-15 16:45:16 0 365
Telangana
చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్>  మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-09-10 12:26:53 0 268
Andhra Pradesh
తిరుమల అన్నప్రసాద సేవపై విదేశీయుడి భక్తుడి ప్రశంసలు
తిరుమల శ్రీవారి అన్నప్రసాద వితరణను చూసి ఓ విదేశీయుడు ఆశ్చర్యపోయాడు. రోజూ లక్ష మందికి పైగా...
By Pagadala Venkateswar 2026-01-13 07:21:39 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com