Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.

0
115

వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక

 

ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి

24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ

అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.

 

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, "బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం...
By Boiena Rajesh 2026-03-21 10:45:56 0 155
Andhra Pradesh
విజయ్‌ని అభినందించిన ఏపీ సీఎం చంద్రబాబు.
తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన విజయ్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు...
By Pagadala Venkateswar 2026-05-05 06:34:06 0 63
Telangana
తెలంగాణలో భారీ వర్షాలు: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ హెచ్చరిక: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఏడు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో...
By Triveni Yarragadda 2025-08-11 14:11:19 0 1K
Andhra Pradesh
Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ పైపులు దగ్ధం.
      Megha Engineering: అమరావతిలో మళ్ళీ భారీ అగ్నిప్రమాదం.. ఈసారి మేఘా కంపెనీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:48:46 0 182
Andhra Pradesh
విజయవాడ దుర్గ గుడికి విచ్చేసిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు దంపతులు
*విజయవాడ దుర్గ గుడికి విచ్చేసి ఆదివారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన...
By Rajini Kumari 2025-12-15 08:20:04 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com