Pemmasani Chandrasekhar: ఇప్పటివరకు అంబటిని భరించాం... ఈ రోజు నుంచి సినిమా చూపిస్తాం: కేంద్రమంత్రి పెమ్మసాని.

0
162

వైసీపీ నేత అంబటి రాంబాబుకు కేంద్రమంత్రి పెమ్మసాని తీవ్ర హెచ్చరిక

 

ఇకపై అంబటికి అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్య

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కారణమని వెల్లడి

24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని స్పష్టీకరణ

అంబటి వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి అత్యంత అనుచితమైన భాషలో వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు అంబటిని సహనంతో భరించామని, ఇకపై ఆయనకు అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. 24 గంటల్లో తమ స్పందన ఎలా ఉంటుందో తెలుస్తుందని అల్టిమేటం జారీ చేశారు.

 

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, "బరితెగించి మాట్లాడేవారికి భయపడేలా ట్రీట్‌మెంట్‌ ఉంటుంది. మేం చట్టబద్ధంగా వెళితే ఏం జరుగుతుందో అంబటికి త్వరలోనే తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు.

 

మరోవైపు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని అన్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, అలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆమె హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు డివిజన్లో 34 వేల బస్తాల యూరియా పంపిణీ
పుంగనూరు సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాలలో జనవరి 10 నాటికి 34,811 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు...
By Kothuru Murali 2026-01-13 09:07:30 0 183
SURAKSHA
WB Ex-Cops: Empowering Women After Retirement Duty
WB police officers work for women empowerment across Bengal. Self-help groups get guidance on...
By Kalaga Sailaja 2026-07-03 13:20:41 0 63
Telangana
క్యాతన్ పల్లి మున్సిపల్ లో గెలిచిన కౌన్సిలర్స్ ని సన్మానించిన ktr
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతనపల్లి మున్సిపాలిటీలో గెలిచిన...
By Avunoori Mahesh 2026-04-12 12:51:46 0 144
Andhra Pradesh
మదనపల్లెలో కిడ్నీ రాకెట్ కేసు.......... మరో అరెస్టు
మదనపల్లెలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో నిందితుడిని ఆదివారం అరెస్ట్...
By Pagadala Venkateswar 2026-04-20 03:34:26 0 105
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com