పోడు రైతుల సమస్యలపై జిల్లా ఇంచార్జ్ మంత్రి గారికి వినతిపత్రం అందించిన మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు గారు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

0
123

🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పోడు రైతులు ఎదుర్కొంటున్న సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి వినతిపత్రం అందించిన. మాజీ డీసీసీ అధ్యక్షులు కె. విశ్వప్రసాద్ రావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు స్వయంగా మంత్రి గారిని కలిసి రైతుల బాధలను వారి దృష్టికి తీసుకెళ్లారు.కెరమేరి మండలం సుర్దాపూర్, జైనూర్ మండలం పొలస, సిర్పూర్ (యు) మండలం మరియు లింగాపూర్ మండలం వంజరిగూడ గ్రామాల పరిధిలోని పోడు రైతులు అనేక సంవత్సరాలుగా ఆ భూముల్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ భూములే వారి కుటుంబాలకు ఏకైక జీవనాధారమని వివరించారు. వినతిపత్రాన్ని సానుకూలంగా స్వీకరించిన మంత్రి గారు స్పందిస్తు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పోడు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ గారు, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు ముసాదే చరణ్ గారు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
By Pagadala Venkateswar 2026-03-08 04:48:23 0 136
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 180
Bharat Aawaz
Are Relationships Losing Value Today?
Are We Losing Our Values in the Name of “Modern Freedom”? — A Painful...
By Reshma Mohammed 2025-12-26 07:06:26 0 686
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 278
Andhra Pradesh
టిఆర్ఎస్ పదవికి వన్నె తేవాలి
*జేఎస్ఆర్ పదవికి వన్నె తేవాలి...*   ************************* మంగళగిరి ఆర్ఆర్ టవర్స్ లోని...
By Rajini Kumari 2026-02-05 09:15:34 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com