విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.
చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డియల్డివో కే. పద్మావతి గారు మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టాన్ని సవరించి వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 రూపొందించడం జరిగినదని, పథకం పేరు మార్చడంతో పాటు అదనంగా 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలు పెంచారని, పథకంలో అమలు అయ్యే పనుల గురించి మరియు విభిజి రాంజీ యొక్క ప్రయోజనాల గురించి 6 వారాలపాటు మండల మరియు గ్రామీణ స్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి చట్టం యొక్క లక్ష్యం ఉపాధి శ్రామికుల హక్కులు, చెల్లింపు వ్యవస్థ, పంచాయితీ ఆధారిత అమలు పై విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.గ్రామస్థాయి సిబ్బంది అందరూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి పథకం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు విశిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో "జన్ సంవాద్" పేరుతో చేపట్టే ప్రచార కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీవో గారు, ఏపీఓ మరియు చీరాల, వేటపాలెం ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, అనుబంధ శాఖల సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.
#Narendra
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz