విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది.

0
177

చీరాల: ఈరోజు వేటపాలెం మండలం కొత్తపేట గ్రామపంచాయతీ నందు విభి జి రామ్ జి చట్టం 2025 గురించిన కొత్త మార్గదర్శకాలు గురించి చీరాల మరియు వేటపాలెం మండల స్థాయి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడమైనది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి డియల్డివో కే. పద్మావతి గారు మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఇజిఎస్ చట్టాన్ని సవరించి వికసిత భారత్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 రూపొందించడం జరిగినదని, పథకం పేరు మార్చడంతో పాటు అదనంగా 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలు పెంచారని, పథకంలో అమలు అయ్యే పనుల గురించి మరియు విభిజి రాంజీ యొక్క ప్రయోజనాల గురించి 6 వారాలపాటు మండల మరియు గ్రామీణ స్థాయిలో ప్రజా చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి చట్టం యొక్క లక్ష్యం ఉపాధి శ్రామికుల హక్కులు, చెల్లింపు వ్యవస్థ, పంచాయితీ ఆధారిత అమలు పై విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.గ్రామస్థాయి సిబ్బంది అందరూ ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి  పథకం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు విశిష్టతను ప్రజలకు అర్థమయ్యేలా చేయాలనే ఉద్దేశంతో "జన్ సంవాద్" పేరుతో చేపట్టే ప్రచార కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో వేటపాలెం ఎంపీడీవో గారు, ఏపీఓ మరియు చీరాల, వేటపాలెం ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, అనుబంధ శాఖల సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....
నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్...
By Gujile Ramu 2026-05-12 08:11:59 0 64
Telangana
నూతన సంవత్సర వేడుకల్లో హద్దు మీరితే చర్యలు తప్పవు - సిపి. సజ్జనార్.IPS.|
హైదరాబాద్ :  నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు...
By Sidhu Maroju 2025-12-24 05:14:26 0 221
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 191
Andhra Pradesh
Population increase
జనాభా నిర్వహణపై దృష్టి సారించక పొతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని సీఎం చంద్రబాబుగారు...
By G k Nookala 2026-03-06 11:14:32 0 99
Andhra Pradesh
మదనపల్లె: రహదారి దుస్థితిపై స్థానికుల ఆగ్రహం.
మదనపల్లెలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కోమటివాని చెరువుపై ఉన్న రహదారి అధ్వాన్న స్థితిపై...
By Pagadala Venkateswar 2026-04-29 04:59:31 0 57
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com