పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం

0
186

*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*

 

*పోలవరం, జనవరి 20:* 

 

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కోతులను తరిమే ప్రయత్నంలో ప్రమాదం: రైతు తీవ్రంగా గాయపాటు.
మదనపల్లి మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలో, చీకిలబైలు గ్రామానికి చెందిన రైతు చిన్నయ్య తన...
By Pagadala Venkateswar 2026-03-21 15:33:02 0 172
Andhra Pradesh
పుంగునూరు: చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్ కొత్తూరు మురళి
రూరల్ సిఐ సాయి ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 2న సోమల మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-04-25 03:06:55 0 103
Andhra Pradesh
పుంగనూరు: సబ్ రిజిస్టార్ పై రూ. 70 వేల ముడుపులు ఆరోపణలు..
పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్...
By Kothuru Murali 2026-06-30 16:32:08 0 101
Madhya Pradesh
CM Mohan Yadav Enforces Strict Action After Dewas Tragedy
Following the tragic explosion at a firecracker factory in Dewas, the death toll rose to five...
By Dunna Jessicaruth 2026-05-15 05:24:14 0 213
Telangana
‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
By Ponnala Srinivasrao 2026-03-09 11:58:35 0 323
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com