పోలవరం ప్రాజెక్టులో రెండవ రోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం

0
185

*పోలవరం ప్రాజెక్ట్ లో రెండోరోజు కొనసాగుతున్న విదేశీ నిపుణుల బృందం పర్యటన*

 

*పోలవరం, జనవరి 20:* 

 

పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ విభాగాల సీనియర్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. రెండో రోజు మధ్యాహ్నం వీరు మెయిన్ డాం గ్యాప్ 2 ఇసుక రీచ్, మెటీరియల్ లభ్యత మొదలైన వాటిని పరిశీలిస్తారు .అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ ప్రతినిధులతో సమావేశమై తోలి రోజు ఫీల్డ్ లో తమ దృష్టికి వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వర రావు, ఈ ఎన్ సి కె నరసింహమూర్తి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ ఆర్ రామచంద్ర రావు, ఎం ఈ ఐ ఎల్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి తదితరులు అంతర్జాతీయ నిపుణుల బృందంతో పాటు కేంద్ర జలవనరుల శాఖ అధికారులకు వివరాలు అందించారు. వారి వివరాలతో పాటు తాము ఫీల్డ్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించుకొని సందేహాలు తీర్చుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి , మనీష్ రాథోర్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, సిఎస్ఎంఆర్ఎస్ అధికారులు మనీష్ గుప్తా , రవి అగర్వాల్ , సీడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధి వి ఎస్ రామారావు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, డైరెక్టర్ కె శంకర్, ఎన్ ఐ ఆర్ ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నైతాని ఉన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కనకదుర్గమ్మ దర్శించుకున్న కట్టా దొరస్వామి నాయుడు.
టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు బుధవారం విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని...
By Pagadala Venkateswar 2026-07-08 11:30:42 1 64
Andhra Pradesh
స్మశాన వాటిక కబ్జాపై కలెక్టరేట్ ఎదుట నిరసన.
మదనపల్లె మండలం కొత్తపల్లి గ్రామంలోని సందిరెడ్డి పల్లె సమీపంలో ఉన్న స్మశాన వాటికను చంగల్ రాయుడు,...
By Pagadala Venkateswar 2026-06-08 15:50:53 0 66
Telangana
ఓఆర్ఎస్' వివాదంలో పిల్లల డాక్టర్‌కు నోటీసులు.. ఫార్మా కంపెనీల తీరుపై మెడికల్ అసోసియేషన్లు ఆగ్రహం
హైదరాబాద్‌కు చెందిన చిన్న పిల్లల డాక్టర్ శివరంజని సంతోష్‌కు ఫార్మా కంపెనీలు లీగల్...
By Ponnala Srinivasrao 2026-03-26 04:35:13 0 204
Jammu & Kashmir
FIR Filed Against Army Officers in Kishtwar Case
Jammu & Kashmir Police have registered an FIR against a Colonel and a Major of the 17...
By Navya Sree 2026-06-27 07:49:53 0 122
Andhra Pradesh
35వ వార్డు సచివాలయంలో ప్రజా సమస్యలపై వేగవంతమైన చర్యలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె 35వ వార్డు సచివాలయంలో గురువారం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-01 04:07:12 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com