Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.

0
183

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి

 

23న విచారణకు రావాలని మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ

రెండు రోజుల క్రితం వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన వైనం

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఇదివరకే నోటీసులు జారీ చేసిన ఈడీ, తాజాగా ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొంది.

 

ఇదివరకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా కొంతకాలం ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన విడుదలయ్యారు. వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని 22వ తేదీన విచారణకు రావాలని కోరిన ఈడీ, ఆ మరుసటి రోజే మిథున్ రెడ్డి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: భక్తులను కటాక్షించిన గంగమ్మ తల్లి
పుంగనూరు పట్టణంలో బుధవారం సుగుటూరు గంగమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి అమ్మవారు...
By Kothuru Murali 2026-03-13 03:27:21 0 146
Telangana
HC Grants Bail to Bandi Bhagirath.|
"₹1 Lakh Surety; Court Bars Witness Influence" Hyderabad: The Telangana High Court has granted...
By Sidhu Maroju 2026-07-09 12:00:54 0 102
Andhra Pradesh
పేద విద్యార్థుల కోసం దాతలు ముందుకు రావాలి: విద్యాంజలి.
ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థుల అభివృద్ధికి దాతలు 'విద్యాంజలి' కార్యక్రమంలో భాగస్వాములు...
By Pagadala Venkateswar 2026-02-18 10:38:28 0 163
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 90 కి పైగా కేసుల పరిష్కారం
*లోక్‌ అదాలత్‌లో 90కి పైగా కేసుల పరిష్కారం*    *మంగళగిరి రూరల్ ఎస్సై...
By Rajini Kumari 2025-12-24 08:05:42 0 190
Telangana
నిజామాబాద్: బైక్ లో మంటలు తపినా ప్రమదం
రోడ్‌పై వెల్టునాసమాయంలో అకాస్మతుగా ధ్వీచక్ర వాహనం లో మంటలుచెలారెగి వాహనం దగ్ధమైన ఘట్టానా...
By Sadaq Sadaq 2026-04-07 18:11:09 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com