పెద్ద వడ్లమూడి గ్రామంలో ముగ్గురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

0
190

*మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు*

 

*పెద్దవడ్లపూడి గ్రామంలో 3 గురికి సీఎం రిలీఫ్ ఫండ్ రూ 2,23,923 ల చెక్కులు పంపిణీ*

 

మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సిఎంఆర్ చెక్కులను మంత్రి నారా లోకేష్ చొరవతో టీడీపీ నాయకులు పంపిణీ చేశారు.ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ సహాయం అందిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. వైద్య చికిత్సలు, ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఈ సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులైన జవ్వాది సాంబశివరావు కు రూ 65,536/-, చిట్టిబొమ్మ అనురాధ కు రూ 1,24,523/- వాక శ్రీనివాసరావు కు రూ 33,864 ల చెక్కులను ముగ్గురికి మొత్తం రూ 2,23,923 చెక్కులను టిడిపి నాయకులు వాటి నివాసాలకు వెళ్లి అందజేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందుతున్న ఈ ఆర్థిక సహాయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతోందని టీడీపీ నాయకులు తెలిపారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబం సభ్యులు మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.చెక్కును అందజేసినవారి లో మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్,మాదల రమేష్ బాబు,చిట్టి బొమ్మ వెంకటేశ్వరరావు, నడపన దుర్గారావు, కనపాల సాగర్,యోమినేని సుధాకర్, ఉల్లంగీ శ్రీనివాసరావు,వాకా బాజీ, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
ఎమ్మెల్యే కోవలక్ష్మి గారిని అవమానపరచలేదు, సమయాభావం వల్లే మాట్లాడే అవకాశం రాలేదు: కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్ గారు
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్  న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల...
By Chunarkar Jagadeesh 2026-06-02 15:42:23 0 313
Andhra Pradesh
Chandrababu Naidu: అమరావతిలో మొదటిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు... సీఎం చంద్రబాబు స్పందన.
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు జరగడంపై సీఎం చంద్రబాబు హర్షం ఈ రిపబ్లిక్ డే ఏపీ ప్రజలకు...
By Pagadala Venkateswar 2026-01-26 11:12:52 0 304
Telangana
జగ్జీవన్ రామ్ జయంతి
మనూర్ :- మనూర్ మండలంలోని బాధల్ గవ్ గ్రామ చౌరస్థలో మాజీ ఉప ప్రధాని, స్వసంత్ర సమరయోధుడు డాక్టర్...
By Gandla Vaijanath 2026-04-05 07:41:53 0 346
Telangana
Nizamabad. కార్పోరేటర్. ను సన్మనించినా కమిటి సభ్యూడు
నిజామాబాద్ జిల్లా గాయత్రినాగ్ లో శ్రీ గాయత్రీ చైతన్య కమిటీ అద్వార్యములో స్టానిక కర్పోరేటర్...
By Sadaq Sadaq 2026-02-22 11:01:27 0 197
Andhra Pradesh
అసౌకర్యంగా మేకల సంత - ఇబ్బందులు పడుతున్న రైతులు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామం "శ్రీ రాజా వత్సవాయి బుచ్చి...
By BABJI DADALA 2025-12-23 09:32:13 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com