డంప్ యార్డ్ తరలించాలి: ఈటల.|

0
110

"నిరసనకారుల అరెస్టులు సరికావని విమర్శ.. వెంటనే విడుదల చేయాలని డిమాండ్"

మేడ్చల్ మల్కాజ్‌గిరి, జూలై 11:- జవహర్‌నగర్ డంప్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, డంప్ యార్డును తరలించి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. 

డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జవహర్‌నగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన నేపథ్యంలో షామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఈటల రాజేందర్, నిరసనకారులను పరామర్శించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో జవహర్‌నగర్‌లో స్థానిక ప్రాంతాల చెత్త మాత్రమే డంప్ చేసేవారని, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలోని భారీ స్థాయిలో చెత్తను ఒకే ప్రాంతంలో వేయడం వల్ల జవహర్‌నగర్, బాలాజీనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలు తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయని అన్నారు.

చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, లీచేట్ వాటర్ శుద్ధి వంటి చర్యలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, దీంతో పర్యావరణం, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆరోపించారు. గతంలో ఈ సమస్యపై పోరాడిన రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాయడం సరికాదని, అరెస్టులు, కేసులు సమస్యకు పరిష్కారం కావని ఈటల రాజేందర్ అన్నారు. నగరంలోని చెత్తను ఒకే ప్రాంతంలో వేయకుండా వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించి, జీరో పొల్యూషన్ లక్ష్యంతో ఆధునిక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

#Sidhumaroju

Search
Categories
Read More
Telangana
"బతుకమ్మ"సినిమా మరో "కంతార"లాంటి సంచలన విజయాన్ని అందుకోగలదు ...శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సంస్కృతి, జీవన విధానం మరియు ప్రకృతితో ముడిపడిన 'బతుకమ్మ' పండుగ నేపథ్యంతో ఒక సరైన సినిమా...
By Ponnala Srinivasrao 2026-06-12 10:37:10 0 137
Himachal Pradesh
HP Sharpens Focus on Governance and Major Development
In a move to accelerate development, the Himachal Pradesh government is reinforcing its...
By Lokeshwari Panthadi 2026-06-27 09:40:51 0 75
Chhattisgarh
Chhattisgarh Advances Urban Development and Smart Growth
Chhattisgarh is accelerating urban development through investments in smart infrastructure,...
By Fathima Safa 2026-07-01 09:41:35 0 46
Andhra Pradesh
19న ఘనంగా ఉగాది వేడుకల నిర్వహణ:VZM కలెక్టర్
శ్రీ పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈనెల 19న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు...
By Boiena Rajesh 2026-03-17 13:18:26 0 206
Telangana
భద్రాచలం బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకం సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు
భద్రాచలం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా...
By Lakavath Kiran 2026-03-31 12:58:54 0 419
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com