యాదమ్మ నగర్ లో ముగ్గుల ముచ్చట్లు : విజేతలకు నగదు పురస్కారం .|

0
233

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 135 డివిజన్ లోని యాదమ్మ నగర్ గద్దర్ కాలనీలో రంగోలి( ముగ్గుల) పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో కాలనీలోని  200 వందల కుటుంబాలకు చెందిన మహిళలు పాల్గొని, తమ ఇంటి ముంగిట ముగ్గులతో కళాత్మకతను చాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అర్బన్ కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడంలో మహిళల పాత్ర కీలకమని, ఇలాంటి సామూహిక వేడుకలు, ఐక్యతను పెంచుతాయని కొనియాడారు. ఈ ప్రత్యేక సందర్భంలో మిమ్మల్ని కలవడం నాకు అత్యంత ఆనందకరమని తెలియజేశారు. 

ఈ ముగ్గుల పోటీలో పాల్గొని విజేతలైన ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

 ప్రధమ బహుమతి : కవిత. రూ.3000/-

ద్వితీయ బహుమతి : మాధవి రూ. 2000/

తృతీయ బహుమతి :పుట్టపాక చిట్టెమ్మ.రూ 1000/-

విజేతలకు ఆయన నగదు పురస్కారం అందజేశారు.

పండుగ కానుకగా కాలనీ లోని ప్రతి మహిళకు చీరలను పంపిణీ చేయడం విశేషం.

ఈ కార్యక్రమంలో... డివిజన్ అధ్యక్షులు, గోరించి సిద్ధారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ, మైపాల్ రెడ్డి, సూర్య, కాలనీ చైర్మన్ స్వామి, ప్రెసిడెంట్ వెంకటస్వామి, ఉపాధ్యక్షులు నాయక్, సెక్రటరీ చిన్నబాబు,  తదితర బిజెపి నాయకులు, అధిక సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. 

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: 'అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యలేదు.. ఆ వార్త అవాస్తవం'
పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామానికి చెందిన నారాయణమ్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె భర్త రామయ్య...
By Kothuru Murali 2026-02-25 11:08:34 0 143
Andhra Pradesh
ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు
మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి...
By Benguluri Madhubabu 2026-02-27 03:50:41 0 227
Andhra Pradesh
హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కవచం : డి.ఎస్.పి పావని.
మదనపల్లి డీఎస్పీ పావని మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారునికి ప్రాణరక్షణ కవచమని...
By Pagadala Venkateswar 2026-04-29 05:09:28 0 110
Andhra Pradesh
CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం
*Press Release*   *నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*   *సీఎం...
By Rajini Kumari 2025-12-23 08:02:09 0 214
Andhra Pradesh
పుంగనూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో మంగళవారం భాష్యం స్కూల్ సమీపంలో సింగం వారి పల్లి గ్రామానికి...
By Kothuru Murali 2026-01-28 09:02:56 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com