CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం

0
146

*Press Release*

 

*నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*

 

*సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం*  

 

*అమరావతి, డిసెంబర్ 22 :* జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరును తొలగించడం సమంజసం కాదని, దీనిపై కేంద్రంతో మాట్లాడి మహాత్మాగాంధీ పేరును కొనసాగించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావుతో పాటు రామకృష్ణ సీఎంను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎమ్‌జీఎన్‌ఆర్ఈజీఎస్ పథకానికి ఇచ్చే 90 శాతం నిధులను 60 శాతానికి కేంద్రం కుదించిందని, 40 శాతం నిధులను రాష్ట్రం భరించాలంటే ఏపీ సహా పలు రాష్ట్రాలపై ఆర్థిక భారం పడుతుందని సీఎంతో అన్నారు. అదే విధంగా 100 నుంచి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుటుంబానికి సగటున 50 పని దినాలు కూడా కల్పించలేదని తెలిపారు. ఇప్పటి వరకూ హక్కుగా ఉన్న ఈ చట్టంలో సవరణల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కష్టంగా మారుతుందని, వెంటనే సవరణలను వెనక్కి తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. 

****

Search
Categories
Read More
Andhra Pradesh
సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు మృత్యుంజయ స్వామిని దర్శించుకున్నారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలోని మృత్యుంజయశ్వర స్వామిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి...
By Kothuru Murali 2025-12-29 13:43:28 0 125
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 124
Andhra Pradesh
రైతును కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ఉల్లి పంట సాగు చేసి పండించిన రైతు కు కన్నీరే మిగిలింది. ఇది మన గూడూరులో చోటు చేసుకుంది
భారీ వర్షానికి పంటలు పాడయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేపడితే ఏకదాటి వర్షానికి నేలకొరిగాయి . గత...
By mahaboob basha 2025-08-15 00:56:15 0 629
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com