ఓబన్న ఆయన త్యాగాలు తరతరాలు చాటాలి మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు

0
127

రేనాటి పోరాటానికి ప్రతీక వడ్డే ఓబన్న.. ఆయన త్యాగాలు తరతరాలకు చాటాలి

 

టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

 

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ (గొల్లపూడి) : 11 జనవరి 2026

 

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్‌ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి సాయుధ పోరాటాన్ని నిర్వహించిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను పురస్కరించుకొని టిడిపి నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. 

 

గొల్లపూడిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం దేవినేని ఉమా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ విశ్వకర్మ, వాల్మీకి, కనకదాస జయంతులను ఘనంగా నిర్వహించారని గుర్తు చేశారు. అదే తరహాలో మరో బీసీ ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని కూడా రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్నూలు జిల్లా రేనాటి ప్రాంతంలో 1807 జనవరి 11న సంచార జాతికి చెందిన వడ్డెర కులంలో వడ్డే ఓబన్న జన్మించారని తెలిపారు. శిస్తులు వసూలు విషయంలో బ్రిటీష్‌ ఈస్టు ఇండియా కంపెనీ అధికారులకు, రేనాటి పాలెగాళ్లకు మధ్య ప్రారంభమైన ఘర్షణలు క్రమేపీ సాయుధ పోరాటాలుగా మారాయని వివరించారు. ఈ ఉద్యమంలో నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటం విశేష ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. బ్రిటీష్‌ పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొని వడ్డే ఓబన్నకు ఘన నివాళులు అర్పించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 159
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 168
Rajasthan
RUHS Releases Merit List for 1,700 Medical Officer Posts After Delay
The Rajasthan University of Health Sciences (RUHS) has finally published the merit list for 1,700...
By Bharat Aawaz 2025-07-17 07:38:06 0 2K
Andhra Pradesh
కల్తీ పాల మృతుల కేసులో సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్షల పరిహారం
*Press Release*   *కల్తీపాల మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం*  ...
By Rajini Kumari 2026-02-23 11:57:32 0 110
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com