వన్ నేషన్- వన్ ఎలక్షన్ తోనే దేశాభివృద్ధి సాధ్యం.|

0
126

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరగాలన్న వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానానికి భారతీయ జనతా పార్టీ మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ట్ కో కన్వీనర్ కరుణశ్రీ కందుకూరి, బలమైన మద్దతు తెలిపారు.

తుర్కపల్లి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలలో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో...

కరుణశ్రీ మాట్లాడుతూ…

కౌన్సిలర్, కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తే ఎన్నికల ఖర్చులు భారీగా తగ్గుతాయని, ప్రజలపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు.ఎన్నికల కారణంగా పదే పదే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అమలుతో స్థిరమైన పాలన, వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి..మేడ్చల్–మల్కాజ్‌గిరి బీజేపీ కన్వీనర్ అంజలిదేవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అనురాధ దేవి, విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొని ప్రజలకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అవసరాన్ని వివరించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

 

#sidhumaroju.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరులో మున్సిపల్ కార్మికుల ధర్నా
మునిసిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి...
By John Baji 2025-12-29 10:06:10 0 125
Andhra Pradesh
Ugadi: 'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!
తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు...
By Pagadala Venkateswar 2026-03-20 03:50:09 0 92
Andhra Pradesh
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం గారి జన్మదిన వేడుకలు
21.12.2025 తాడేప‌ల్లి    - జ‌నం త‌ల‌రాత‌లు మార్చే...
By Rajini Kumari 2025-12-21 08:45:59 0 132
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 264
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com