గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసిన నడిపించిన తాడేపల్లి పోలీసులు.

0
194

 *గుంటూరు జిల్లా పోలీస్...* *తాడేపల్లి పోలీస్ స్టేషన్...* *ది.25.12.2025* _*//ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్... నడిరోడ్డుపై నడిపించిన తాడేపల్లి పోలీసులు,.//*_ 🚩 పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 18(18.12.2025)వ తేదీ రాత్రి తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మదర్ థెరిసా కాలనీ సమీపంలోని అరటి తోటలో బ్రహ్మానందపురానికి చెందిన ఆటో డ్రైవర్ ఇల్లచెరువు.వెంకటరావు (32) అనే వ్యక్తిని జన్మదిన వేడుక సందర్భంగా జరిగిన చిన్న వివాదం నేపథ్యంలో మల్లినేని. సాయి భవాని అలియాస్ సాయి, వేమూరి మహేష్ బాబు అలియాస్ మహి దాడి చేసి సిమెంటు రాళ్లతో మోది హత్య చేయగా, ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, సీఐ వీరేంద్ర బాబు గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్ట్ చేసినట్లు నిన్న(24.12.2025) జరిగిన మీడియా సమావేశంలో నార్త్ డిఎస్పీ మురళీ కృష్ణ గారు తెలిపారు. 🫟తదనంతరం తాడేపల్లి సీఐ వీరేంద్ర బాబు గారి పర్యవేక్షణలో ఎస్సై కాజావలి గారి నేతృత్వంలోనీ ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది ఇద్దరు నిందితులను నడిరోడ్డుపై నడిపిస్తూ నడిపిస్తూ, సమాజానికి నిందితుల ప్రవర్తన తెలియజేశారు. 🫟 ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడే వారిపై చట్టం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందనే విషయాన్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, నేరస్తులకు గట్టి హెచ్చరికలు చేసే ఉద్దేశంతో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితులను రోడ్లపై నడిపిస్తూ ప్రదర్శన చేసినట్లు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరు పట్టణం లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు సముదాయంలో రూ. 59 లక్షల వ్యయంతో...
By Kothuru Murali 2026-03-09 08:04:14 0 129
Andhra Pradesh
సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం...
By Ratna Sekhar 2026-03-10 14:46:00 0 311
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com