పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

0
184

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*

 

*పత్రికా ప్రకటన* *ది.05.01.2026.*

 

*పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు.*

 

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.

 

  ఈ నేపధ్యంలో ఈ రోజు ది.05.01.2026 వ తేదిన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ గారి ఆదేశాలు మేరకు డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు, క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీ ఎం రాజారావు గార్లు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 77 ఫిర్యాదులపై భాదితులతో మాట్లాడటంతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది. 

 

ఈరోజు అందిన ఫిర్యాదుల్లో భూవివాదాలకు, ఆస్తి వివాధాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 44, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 05, వివిధ మోసాలకు సంబంధించినవి 01, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 08, వివిధ సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 19 మొత్తం 77 ఫిర్యాదులును స్వీకరించడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు క్రైమ్ ఏ.డి.సి.పి శ్రీ ఎం రాజరువుగారు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించుటలో సహకారాన్ని అందించారు.

***

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం...
By Kothuru Murali 2026-04-13 08:20:26 0 74
Karnataka
New Alcohol-in-Beverage Tax Structure Rolls Out
Karnataka has implemented a pioneering Alcohol-in-Beverage (AIB) excise policy, shifting taxation...
By Dunna Jessicaruth 2026-05-18 06:43:58 0 26
Andhra Pradesh
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం
పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో 6 వేల సంవత్సరాల పురాతన శివలింగం...
By Kothuru Murali 2026-02-15 06:20:10 0 115
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com