పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

0
156

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, విజయవాడ.*

 

*పత్రికా ప్రకటన* *ది.05.01.2026.*

 

*పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు.*

 

ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది.

 

  ఈ నేపధ్యంలో ఈ రోజు ది.05.01.2026 వ తేదిన పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ గారి ఆదేశాలు మేరకు డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు, క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీ ఎం రాజారావు గార్లు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 77 ఫిర్యాదులపై భాదితులతో మాట్లాడటంతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది. 

 

ఈరోజు అందిన ఫిర్యాదుల్లో భూవివాదాలకు, ఆస్తి వివాధాలకు, నగదు లావాదేవీలకు సంబంధించినవి 44, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 05, వివిధ మోసాలకు సంబంధించినవి 01, మహిళా సంబంధిత నేరాలకు సంబంధించి 08, వివిధ సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 19 మొత్తం 77 ఫిర్యాదులును స్వీకరించడం జరిగినది.

 

ఈ కార్యక్రమంలో డి.సి.పి. శ్రీ ఎస్.వి.డి.ప్రసాద్ గారు క్రైమ్ ఏ.డి.సి.పి శ్రీ ఎం రాజరువుగారు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించుటలో సహకారాన్ని అందించారు.

***

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : సుబ్రహ్మణ్యేశ్వరుని తాకిన సూర్యకిరణాలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల కేంద్రంలోని వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం...
By Kothuru Murali 2026-04-02 06:42:13 0 71
Rajasthan
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns
Schools Reopen in Rajasthan’s Border Districts as Calm Returns Jaipur / Sri Ganganagar...
By BMA ADMIN 2025-05-20 07:06:22 0 2K
Andhra Pradesh
వేట్లపాలెం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదన...
By Ratna Sekhar 2026-03-11 08:01:56 0 331
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 178
Bharat
124 నాటౌట్: పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ తప్పిదాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపల వినూత్నంగా...
By Bharat Aawaz 2025-08-12 09:40:51 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com