కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్

0
241

కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత

• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. గురువారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తన నివాస కార్యాలయంలో కార్మికులకు మిఠాయి బాక్సులు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకన్నా ముందు కమిషనర్ తన సతీమణి పి.చంద్రకళతో కలిసి కార్మికులకు అల్పాహారం వడ్డించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… ప్రజారోగ్యం, ప్రాథమిక మానవ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంలో కార్మికుల పాత్ర అమూల్యమైనదని పేర్కొన్నారు. అందుకే వారి సంక్షేమానికి నగరపాలక సంస్థ ఎప్పుడూ వెనకాడలేదన్నారు. కార్మికులకు వేతనాలు, కిట్లు వంటి సదుపాయాలు సకాలంలో అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను కార్మికులతో కలిసి జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా కార్మికుల అభ్యున్నతికి చట్టపరిధిలో సాధ్యమైన అన్ని సౌకర్యాలు ఎటువంటి జాప్యం లేకుండా కల్పించేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

అదేవిధంగా తహశీల్దార్ రవికుమార్, అదనపు కమిషనర్ ఆర్‌.జి.వి.కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ యన్.చిన్నరాముడు, కార్యదర్శి నాగరాజు, డిసిపి వెంకటరమణ, ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగశివ ప్రసాద్, ఇంచార్జి ఎస్‌.ఈ. శేషసాయి, అకౌంట్స్ ఆఫీసర్ మురళి, ఎగ్జామినర్ సుబ్రహ్మణ్యం, ఆర్ఓలు జునైద్, ఇశ్రాయేలు, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, రామకృష్ణ, మంజూర్ బాష, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు కమిషనర్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*  ...
By Rajini Kumari 2025-12-20 12:17:56 0 196
Andhra Pradesh
పదోన్నతి పొందిన చంద్రశేఖర్‌ను సత్కరించిన టీడీపీ నేతలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, క్రైమ్ బ్రాంచ్ సీఐగా సమర్థవంతంగా పనిచేసి డీఎస్పీగా పదోన్నతి పొందిన...
By Pagadala Venkateswar 2026-07-10 05:26:33 0 59
Andhra Pradesh
పుంగనూరు: మేము ప్రమాణానికి సిద్ధం మరి మీరు... కొత్తూరు మురళి
బుధవారం పుంగనూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీవై పార్టీ కన్వీనర్ హరిబాబు, పార్టీ...
By Kothuru Murali 2026-03-20 06:10:35 0 136
Business & Finance
Grow Faster with Public Limited Company Registration
Registering a Public Limited Company is the ideal choice for businesses planning large-scale...
By Navya Sree 2026-07-08 07:17:25 0 52
Andhra Pradesh
దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య
కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల...
By Vadlamudi NagaVenkat 2026-03-18 14:40:30 0 727
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com