మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో మంత్రి లోకేష్ 79 వ రోజు ప్రజా దర్బార్

0
192

*Press Release*

 

*మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్*

 

*వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరణ*

 

*సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ*

 

మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వైసీపీ హయాంలో సర్క్యులర్ ను అమలుచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 6వేలకు పైగా ఓటింగ్ కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. టీడీపీ సానుభూతిపరులమనే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రరావు ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్ల బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైసీపీకి చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన ఎమ్.శారదాంబ, ఎమ్.సునీత కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

*****

Search
Categories
Read More
Business & Finance
TAN Registration for Hassle-Free TDS Compliance
TAN (Tax Deduction and Collection Account Number) Registration is mandatory for businesses and...
By Navya Sree 2026-07-21 06:05:11 0 44
Andhra Pradesh
శక్తి టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
బాపట్ల జిల్లా రామాపురంలో శక్తి టీమ్ తో స్టూడెంట్స్, బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజన్ రామపురం నందు...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:24:33 0 213
Andhra Pradesh
జిల్లాకు విచ్చేసిన వ్యవసాయ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూల్ ఎస్పీ :
కర్నూలు జిల్లా...వ్యవసాయ శాఖ మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...  డిఐజి , కర్నూలు...
By Hari Krishna 2026-01-03 14:52:20 0 232
SURAKSHA
తెలంగాణ పోలీసులు పేదలకు అన్నదానం, ఉచిత వైద్యం
ఈరోజు తెలంగాణ పోలీస్ సిబ్బంది నగరంలోని రోడ్డుపక్కన నివసించే నిరుపేదలకు వేడివేడి అన్నం, తాగునీరు...
By Kalaga Sailaja 2026-07-06 04:53:42 0 48
Telangana
పొంగులేటి సమక్షంలో ఏదులాపురం ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనిత...
ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాలోని ఏదులాపురం మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి...
By Krishna Balina 2026-02-23 09:07:19 0 333
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com