గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి ని ఢీ కొట్టడం తో వ్యక్తి మరణానికి కారణంగా నిరూపించటంతో జైలు శిక్ష.

0
207

గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 30.12.2025* _*//రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన కేసులో ఆటో డ్రైవర్ కు 22 నెలల జైలు శిక్ష,రూ.10,000/- జరిమానా,.//*_ *🔰కేసు వివరాలు :* ది.07.10.2018న తెల్లవారుజామున నిందితుడు తన ఆటోను చేబ్రోలు నుండి ముట్లూరు వైపు అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ, ఎదురు దిశ నుండి టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ (వాహనం నం. AP07UTTR8412) పై ప్రయాణిస్తున్న కొచర్ల.హృదయరాజు (48 సంవత్సరాలు)ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హృదయరాజు తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించగా, చికిత్స పొందుతూ 12.10.2018 సాయంత్రం 7.03 గంటలకు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి అప్పటి డి.అశోక్ గారు Cr.No: 140/2018, Sec 304-A IPC, 180, 181 of Motor vehicles act. కింద కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరిపి, కోర్టు వారికి సాక్ష్యాధారాలను సమర్పించారు.తదుపరి ఈ కేసులో ప్రస్తుత సీఐ రామా నాయక్ గారు మరింత సమగ్ర దర్యాప్తు జరిపి, కారులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినారు. 🔰 సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, గుంటూరు గారు నిందితుడిని Cr.P.C సెక్షన్ 255(2) ప్రకారం దోషిగా నిర్ధారించి,1 సంవత్సరం 10 నెలల సాధారణ కారాగార శిక్ష మరియు రూ.10,000/- జరిమానా (జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 1 నెల సాధారణ కారాగార శిక్ష). *🔰 నిందితుడు వివరాలు :* పలపర్తి.సత్యనారాయణ, తండ్రి వెంకటేశ్వర్లు (45 సంవత్సరాలు) ముట్లూరు గ్రామం, (ఆటో డ్రైవర్ – వాహనం నం. AP 07 TK 1662). * దర్యాప్తు అధికారులు : CI రామానాయక్ గారు, SI శ్రీ డి. అశోక్ గారు. * ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన వారు: శ్రీ పి. మురళీ కృష్ణ, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ * న్యాయస్థానం : గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, గుంటూరు * గౌరవ న్యాయమూర్తి : శ్రీమతి వి. దీప్తి. * CMS సీఐ నరసింహారావు గారు * కోర్ట్ పి.సి : PC-4343 ఈ. ప్రకాష్‌బాబు, వట్టిచెరుకూరు పోలీస్ స్టేషన్ 👉 రోడ్డు భద్రత నిబంధనలను పాటించకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - నేటి నుంచి అమల్లోకి..! ముఖ్యమైన వివరాలు
ఏపీ ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరుకుంది. ఈ కొత్త...
By John Baji 2025-12-31 05:57:02 0 78
Andhra Pradesh
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
By Rajini Kumari 2026-01-14 12:39:55 0 82
Bharat Aawaz
"చేనేత - భారతీయ గర్వం, మన చేతిలో భవిష్యత్"
ఇది మన కథే, మన గౌరవం కూడా – చేనేతను గౌరవిద్దాం! మన దేశ గౌరవం, మన చేతిలో దాగి ఉంది. మనం...
By Pulse 2025-08-07 10:24:40 0 2K
Andhra Pradesh
కెనాల్ రోడ్లు ఆక్రమించుకున్న ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు
*కెనాల్ రోడ్లో రోడ్డు ఆక్రమించుకున్న*  *ఆక్రమణల తొలగింపు పనులు చేపట్టిన పోలీసులు*  ...
By Rajini Kumari 2025-12-16 12:05:04 0 112
Andhra Pradesh
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**   *శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**   • చెన్నుపాటి...
By Rajini Kumari 2025-12-16 09:34:03 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com