నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థి భర్తీ చేయాలి గిరిజన ప్రజా సంఘాలు

0
173

*నెల్లూరు మేయర్ స్థానాన్ని ఎస్టీ అభ్యర్థినికి భర్తీ చేయాలి - గిరిజన ప్రజా సంఘాల జేఏసీ*

 

విజయవాడ: కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో పాలన సాగిస్తుందని గిరిజన ప్రజాసంఘాల జేఏసీ అధ్యక్షులు మానుపాటి నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన గిరిజనుల తలరాతలు మారడం లేదన్నారు. రాజ్యాంగంలో ఎస్టీలకు ఇచ్చిన హక్కులకు ప్రభుత్వాలు గండి కొడుతున్నాయన్నారు. నెల్లూరులో మేయర్ పదవి ఎస్టీకి రాజ్యాంగబద్ధంగా కేటాయించబడిందని, గత ప్రభుత్వంలో గిరిజన మహిళ మేయర్ పదవిలో కొనసాగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో గిరిజన మహిళపై దాడుల నేపథ్యంలో రాజీనామా చేస్తే ఇంతవరకు మేయర్ పదవిని కుట్రపూరితంగానే భర్తీ చేయలేదన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఎస్టీ అభ్యర్థితో మేయర్ పదవిని భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న గిరిజనుల పై దాడులు ఆపాలన్నారు. లేకుంటే గిరిజన సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏ.వై.హెచ్.పి.ఎస్ జాతీయ అధ్యక్షులు ఎన్.ధర్మ, జేఏసీ నేతలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు...
By Kothuru Murali 2026-03-28 06:07:27 0 130
Telangana
నిజామాబాద్: మండుతున్న ఎండలు
ఎండ తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్త వహించండి! వేసవి తాపం మరియు వడదెబ్బ నుండి మనల్ని మనం...
By Sadaq Sadaq 2026-04-20 12:08:12 0 85
Andhra Pradesh
ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా...
By John Baji 2026-02-05 11:15:19 0 299
Telangana
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం
మద్యం మత్తులో అర్ధనగ్నంగా రోడ్డుపై కానిస్టేబుల్ వీరంగం అనుమానంతో భార్యను రోడ్డుపై చితక బాదిన...
By Pinnehasan Odela 2026-02-02 14:50:24 0 226
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com