మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే

0
148

*మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారమే* 

 

*నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ* 

 

*గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్*

 

*సరియైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలు స్వాధీనం*

 

 

*మంగళగిరి:*

మత్తు పదార్థాలకు అలవాటు పడితే జీవితాలు అంధకారం అవుతాయని నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి సిహెచ్ మురళీకృష్ణ అన్నారు. గుంటూరు రేంజి ఐజిపి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు నార్త్ సబ్ డివిజన్ పరిధిలో అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం నగరంలోని గండాలయ పేటలో కార్డెన్ సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి రవాణా విక్రయాలు, వినియోగంపై తమకు గానీ, 1972 కు సమాచారాన్ని అందిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ పై ప్రజల్లో చైతన్యం కలిగించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో సంకల్పం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సీఐలు వీరాస్వామి, బ్రహ్మం తో పాటు పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నా.రు

Search
Categories
Read More
Telangana
భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 10:56:57 0 99
Andhra Pradesh
మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ...
By Mobbu Venkatramana 2026-01-28 11:55:26 0 443
Andhra Pradesh
శ్మశాన భూమిని కాపాడాలి !!
కర్నూలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ శ్మశాన భూమి కబ్జా – సీఐడీ విచారణ కోరుతూ...
By Hari Krishna 2025-12-24 00:16:32 0 182
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com