హజ్రత్ సయ్యద్ షాబుకారీ బాబా ఉరుసు ఏర్పాట్లను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు

0
234

*ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయము, విజయవాడ*

 

*పత్రికా ప్రకటన* *తేది.26-12-2025*

 

*హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు*

 

ఎన్.టి.ఆర్.జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిది, కొండపల్లి పట్టణ పరిధిలో ఈ నెల 29 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహించు హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా దర్గా 429వ ఉరుసు మహోత్సవ కార్యక్రమం సందర్బంగా ఆదిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపధ్యంలో కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఈ రోజు నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు ఇతర అధికారులతో కలిసి పరిశీలించినారు.

 

ఈ నేపధ్యంలో ముందుగా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు దర్గాలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం కొండపల్లి మరియు పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి అదికారులకు మరియు నిర్వాహకులకు పలు సూచనలు మరియు సలహాలను అంధించారు. పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. గంధం సమర్పించే సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా బందోబస్తు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులకు సూచించారు.

 

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ గారు, పశ్చిమ జోన్ ఏ.డి.సి.పి. శ్రీ గుణ్ణం రామకృష్ణ గారు, పశ్చిమ ఏ.సి.పి. శ్రీ దుర్గారావు గారు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ శ్రీ చంద్రశేఖర్ గారు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‌

* * *

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు.
ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో సంచలనం సృష్టించిన బాలిక హత్య, అత్యాచార ఘటనలో నిందితుడు...
By Pagadala Venkateswar 2026-02-18 11:46:10 0 167
Andhra Pradesh
పుంగనూరు: ఆనందోత్సాహలాలు మునిగిపోయిన ప్రజలు
టీ-20 ప్రపంచ కప్ విజేతగా భారత్ అవతరించడంతో పుంగనూరు నియోజకవర్గంలోని మండలాల్లోని ప్రజలు, క్రికెట్...
By Kothuru Murali 2026-03-09 08:11:28 0 160
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 367
Andhra Pradesh
రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం...
By John Baji 2026-02-11 05:58:30 0 440
Telangana
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం
సూర్యాపేట జిల్లా      కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై లారీని వెనుక నుండి...
By Nookapangu Manikanta 2026-04-11 02:47:26 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com