క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి!! కర్నూలు ఎస్పీ

0
218

కర్నూలు : పత్రికా ప్రకటన (24.12.2025)

కర్నూలు జిల్లా...

క్రిస్మస్,  న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి....

 కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

క్రిస్మస్, న్యూ ఇయర్  నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాల పై కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు పోలీసు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 

డిసెంబర్ 31 వేడుకల్లో  ప్రధాన కూడళ్లలో డ్రంకెన్‌ డ్రైవ్‌, ఆకస్మిక తనిఖీలతోపాటు నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు.

వేడుకల నేపథ్యంలో కొందరు ఆకతాయిలు రోడ్ల  పై  హంగామా చేసి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదన్నారు.

న్యూ ఇయర్ స్వాగతపు వేడుకలను ఆనందంగా జరుపుకోవాలన్నారు.

మద్యం సేవించి అత్యుత్సాహంతో హద్దు మీరి, చట్టపరమైన కష్టాలను తెచ్చుకోవద్దన్నారు. 

ఎవరైనా  చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు.  

వేడుకలను కుటుంబ సమేతంగా, ఇళ్లలో సంతోషంగా నిర్వహిం చుకోవాలన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రిపుల్‌, ర్యాష్‌ డ్రైవింగ్ , రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌,  రోడ్లుపై వెళ్ళేవారిని ఇబ్బందికి గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సైలెన్సర్లు తీసి ద్విచక్ర వాహనాలు నడపడం చేస్తూ శబ్ద కాలుష్యం చేసే వారి పై కఠినంగా వ్యవహరించాలన్నారు.  

మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. 

ద్విచక్ర వాహనాలు నడిపే  యువకులకు హెల్మెట్ లేకుండా  బయటకు పంపించరాదని, లైసెన్సులు లేని మైనర్లకు వాహనాలు ఇచ్చి బయటకు పంపించి   తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దన్నారు.

రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దన్నారు.

ఆయా కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలు హాస్టల్స్ లలో ఉంటున్న విద్యార్దుల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

పోలీసు అధికారులకు, జిల్లా ప్రజలకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు  క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 

ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.

Search
Categories
Read More
Telangana
మహబూబ్‌నగర్‌ డీటీసీ కిషన్‌ అరెస్ట్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు   ₹ 200 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ!  ...
By Ellandula Sandeep 2025-12-24 11:18:31 0 520
Andhra Pradesh
ఐపీఎల్‌లో పంజాబ్, గుజరాత్ మధ్య హోరాహోరీ పోరు
ఐపీఎల్-19లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్...
By Kothuru Murali 2026-04-01 05:55:17 0 117
Tamilnadu
మహబూబాబాద్ జిల్లాలలో 25 మంది ఎస్సైలు బదిలీ
  న్యూస్ (భారత్ ఆవాజ్ ) జిల్లాలో 25 మంది ఎస్సైలు బదిలీ అయ్యారు. మహబూబాబాద్ సీసీఎస్కు...
By Midathapalli Kiran Kumar 2026-04-27 03:33:09 0 155
Andhra Pradesh
ViT సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ లో ప్రారంభించిన కేంద్రమంత్రి
పత్రికా ప్రకటన    *వి.ఐ.టి సబ్ పోస్ట్ ఆఫీస్ ను జెన్ జెడ్ పోస్ట్ ఆఫీస్ గా ప్రారంభించిన...
By Rajini Kumari 2025-12-20 11:45:01 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com