పేద ఇస్త్రీ వృత్తిదారులకు 20 మందికి ఎల్పిజి ఇస్త్రీ పెట్టెల పంపిణీ

0
233

*పేద ఇస్త్రీ వృత్తిదారులకు రోటరీ సాయం*

 

*20 మందికి ఉచిత ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల పంపిణీ*

 

రోటరీ డిస్ట్రిక్ట్–3150 గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ అధికారిక పర్యటనలో భాగంగా, మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పేద ఇస్త్రీ వృత్తిదారులకు ఉచితంగా ఎల్‌పీజీ ఆధారిత ఇస్త్రీ పెట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆదివారం గణపతి నగర్‌లోని వీజే జూనియర్ కాలేజీ ఆవరణలో గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.వి. రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల వినియోగంతో ఇస్త్రీ వృత్తి చేసుకునే వారికి నెలకు సుమారు రూ.2,000 వరకు ఇంధన వ్యయం ఆదా అవుతుందని తెలిపారు. బొగ్గు వినియోగం తగ్గడంతో బట్టలపై మసి అంటకుండా నాణ్యమైన సేవలు అందించగలుగుతారని, తద్వారా వారి వృత్తి నాణ్యత పెరిగి ఆదాయం మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెల వాడకం వల్ల పర్యావరణ కాలుష్యం నియంత్రణకు కూడా దోహదం చేస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పూర్వ జిల్లా గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్, అసిస్టెంట్ గవర్నర్ పూర్ణచందు పాల్గొన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రేగడ రాజశేఖర్ మాట్లాడుతూ, 20 మంది పేద ఇస్త్రీ వృత్తిదారుల కుటుంబాలకు సుమారు రూ.2 లక్షల వ్యయంతో పర్యావరణ హితమైన ఎల్‌పీజీ ఇస్త్రీ పెట్టెలను అందజేశామని తెలిపారు. వీటిలో వేడి నియంత్రణ సౌకర్యం ఉండటంతో ఇంధన ఆదా జరుగుతుందని, బొగ్గు వాడకం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు నివారించవచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి పరేపల్లి నిరంజన్ గుప్తా, సేవా ప్రాజెక్ట్ డైరెక్టర్ చనుమొలు గోపాల్,ఛార్టర్డ్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి,గాజుల శ్రీనివాస్, అందే మురళి, కాపురోతు సుందరయ్యతో పాటు ఇతర రోటరీ ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Muttimbaku Abhishikth Kishore IAS: Young Leader, Big Vision
A dynamic 2015-batch Andhra Pradesh cadre IAS officer whose leadership in district...
By Lokeshwari Panthadi 2026-07-16 10:26:34 0 45
Telangana
పేరుకే కేంద్రాలు... మక్కలు దళారుల పాలు...
పేరుకే కేంద్రాలు.. మ‌క్క‌లు దళారుల పాలు మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం...
By Gujile Ramu 2026-04-30 17:06:14 0 145
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 224
Andhra Pradesh
రూ.2 కోట్లు, బంగారం మోసం చేశారని హిజ్రా ఆత్మహత్యాయత్నం.
మదనపల్లికి చెందిన హిజ్రా స్వాతి, డమరేశ్వర్, స్వర్ణలత అనే దంపతులు తన వద్ద నుంచి 600 గ్రాముల...
By Pagadala Venkateswar 2026-02-24 06:48:39 1 206
Andhra Pradesh
కర్నూలు మెడికల్ కాలేజీ అభివృద్ధి సమావేశంలో పాల్గొన్న మంత్రి !!
కర్నూలు :   కర్నూలు మెడికల్ కళాశాలలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మరియు మెడికల్ కాలేజ్ అభివృద్ధి...
By Hari Krishna 2025-12-26 16:24:41 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com