అంబేద్కర్ విగ్రహం: తిరిగి ప్రతిష్టించకపోతే కేసులు – బక్కి వెంకటయ్య.|

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్  వాల్మీకి నగర్‌లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు.

శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి వెంకటయ్య స్వయంగా పరిశీలించారు. 

అనంతరం బస్తీ వాసులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విగ్రహాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారని స్థానికులు వివరించగా, వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఫణికుమార్‌కు ఫోన్ చేసి సోమవారం లోపు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆదేశించారు.

అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా మల్కాజ్‌గిరి డీసీపీ శ్రీధర్‌ను సంప్రదించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

“ఏప్రిల్ నెల మహనీయుల పండుగల నెల. అలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం, గద్దె కూల్చివేయడం తీవ్ర అవమానం” అని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.

అధికారులు స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురు దళిత నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
మదనపల్లె కలెక్టరేట్‌లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ...
By Pagadala Venkateswar 2026-06-26 03:22:31 0 62
SURAKSHA
Dependra Pathak: A Visionary IPS Officer in Policing
From grassroots policing to national leadership, Dependra Pathak has built a distinguished career...
By Lokeshwari Panthadi 2026-07-24 07:22:18 0 12
Telangana
Uber chief meets C M in their house
ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...
By G k Nookala 2026-05-13 11:29:28 0 206
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 338
SURAKSHA
K. K. Dwivedi: A Distinguished Career in Public Administration
A veteran Uttar Pradesh IAS officer whose decades of administrative service reflect dedication,...
By Kalaga Sailaja 2026-07-23 09:02:50 0 28
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com