సచివాలయం ఆదేళ్లు పార్టీ సొంతిల్లు నారా లోకేష్

0
163

సచివాలయం అద్దె ఇళ్లు… పార్టీ సొంతిల్లు

 

అద్దె ఇంటికి, సొంత ఇంటికి చాలా తేడా ఉంటుంది. మనకు నచ్చకపోతే లేదంటే యజమానికి మనం నచ్చకపోతేనో అద్దె ఇల్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. సొంతిల్లు అలా కాదు.. అదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ పార్టీకి అన్వయించి కార్యకర్తలకు, నేతలకు అర్థమయ్యేలా చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటాము.. అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ శాశ్వతం అని నొక్కి చెప్పారు.

 

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన కేంద్ర కార్యాలయంలో సమావేశం అయ్యారు. రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా వారితో చర్చించారు. పార్టీ నే సుప్రీం, పార్టీ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందే.. ఎంత పెద్ద నాయకులకైనా ఇదే వర్తిస్తుందని ఆయన చెప్పారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యేగా పనితీరుపై ఒక నివేదిక ఇవ్వాలని సమన్వయకర్తలకు ఆయన సూచించారు.

 

చంద్రబాబు, లోకేష్ పరిపాలనకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారో పార్టీకి అంతే సమయాన్ని ఇస్తున్నారు. ఎమ్మెల్యేలకు మంచిగా చెబుతున్నారు. పనితీరు బాగోలేకపోతే మార్చుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే కొంతమంది పదేపదే చెప్పించుకుంటున్నారు అనే అపోహ ప్రజల్లో ఉంది. అది ఆ ఎమ్మెల్యేలకు కూడా మంచిది కాదు. ఇంకా పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తామని లోకేష్ గట్టిగానే చెప్పారు. అయితే గడిచిన రెండు నెలల్లో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని లోకేష్ చెబుతున్నారు. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత సమన్వయకర్తలదే అని ఆయన అన్నారు.

 

పార్టీ పదవుల పైన కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. కార్యకర్తలకే ప్రాధాన్యమని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వాలని ప్రతిపాదిస్తే కచ్చితంగా తిరస్కరించాలన్నారు. పదవుల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం బిగించి పోరాడిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని లోకేష్ అన్నారు.

Search
Categories
Read More
Sports
రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్ అడ్మిషన్స్ ఎంపిక విధానాన్ని పరిశీలించిన సాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి
ఈ రోజు స్పోర్ట్స్ స్కూల్ హకింపేట్‌లో జరుగుతున్న అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా, స్టేట్ లెవెల్...
By Avunoori Mahesh 2026-05-01 08:59:26 0 151
Andhra Pradesh
కాకినాడ ఎంపీని కలిసిన సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్
పెద్దాపురంలో నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమానికి తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.50 లక్షలు మంజూరు...
By Ratna Sekhar 2026-02-19 20:16:08 0 925
Telangana
పెద్దపెల్లి జిల్లా : గోదావరిఖని లారీ లో ఎగిసిపడ్డ మంటలు..!
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోనే గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఒక లారీలో...
By Sunka Santhosh 2026-04-21 17:51:59 0 146
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి తాగునీటి సమస్యలలు    మా కాలనీలో ఉన్నటువంటి...
By Boya Dasthagiri 2026-03-23 12:57:25 0 237
Bharat Aawaz
Building The Future Together!
Building The Future Together! BMA not just an Association—it’s a...
By Bharat Aawaz 2025-07-05 05:30:11 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com