కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్

0
23

For scrolls

 

అమరావతి

 

*కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్*

 

• గత నాలుగు కలెక్టర్ల సదస్సుల్లో జీఎస్డీపీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం.

• గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ల సదస్సు నిర్వహించి తర్వాత ఆ కట్టడాన్ని కూల్చేశారు. అలాగే రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేశారు.

• ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. 

• రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

• ఒకటే జెండా, అజెండా ప్రతీ ఇంటికీ సంపద, అభివృద్ధి చేరాలన్నదే లక్ష్యం.

• ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలి.

• కొందరు నేతలు దొంగతనాల్ని కూడా సమర్థిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది.

• ఇలాంటి విషయాల్లో అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

• ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి.

• సోమవారం ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి

• పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని కలెక్టర్లు అందరినీ కోరుతున్నాను

• పరిశ్రమలకు ఇస్తున్న భూములను, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలి.

• ఇటీవల రెవెన్యూ సంస్కరణల్ని కూడా చేపట్టాం. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలి.

• రీసర్వేను సమర్ధంగా నిర్వహించాలి. 

• 2 లక్షలకు పైగా జాయింట్ ఎల్ పీఎంల వివాదాలను పరిష్కరించండి

• 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• అన్ని రంగాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

• గత పాలకుడు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడు... భావితరాల కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com