కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్

0
124

For scrolls

 

అమరావతి

 

*కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్*

 

• గత నాలుగు కలెక్టర్ల సదస్సుల్లో జీఎస్డీపీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం.

• గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ల సదస్సు నిర్వహించి తర్వాత ఆ కట్టడాన్ని కూల్చేశారు. అలాగే రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేశారు.

• ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. 

• రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

• ఒకటే జెండా, అజెండా ప్రతీ ఇంటికీ సంపద, అభివృద్ధి చేరాలన్నదే లక్ష్యం.

• ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలి.

• కొందరు నేతలు దొంగతనాల్ని కూడా సమర్థిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది.

• ఇలాంటి విషయాల్లో అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

• ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి.

• సోమవారం ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి

• పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని కలెక్టర్లు అందరినీ కోరుతున్నాను

• పరిశ్రమలకు ఇస్తున్న భూములను, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలి.

• ఇటీవల రెవెన్యూ సంస్కరణల్ని కూడా చేపట్టాం. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలి.

• రీసర్వేను సమర్ధంగా నిర్వహించాలి. 

• 2 లక్షలకు పైగా జాయింట్ ఎల్ పీఎంల వివాదాలను పరిష్కరించండి

• 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• అన్ని రంగాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

• గత పాలకుడు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడు... భావితరాల కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Search
Categories
Read More
Andhra Pradesh
అనంతపురం గంగమ్మ గుడి నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు యాదవ్
అనంతపురం గంగమ్మ తల్లి దేవస్థానం నూతన చైర్మన్గా వెంకటేశ్వర్లు నియమిస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-10 03:43:39 0 105
Andhra Pradesh
పట్టపగలే పత్తికొండ పోస్ట్ ఆఫీస్ లో దొంగతనం
కర్నూలు: కర్నూలు జిల్లా పత్తికొండ ఉపతపాల కార్యాలయం నందు శనివారం రోజు ఉదయం 11 గంటలకు పట్టపగలే...
By Hari Krishna 2025-12-14 04:16:01 0 226
Andhra Pradesh
కర్నూలు విచ్చేసిన ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ మెంబర్ !!
కర్నూలు : కర్నూలు సిటీ :కర్నూలు లోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ఏపీ స్టేట్ ఫుడ్  కమిషన్...
By Hari Krishna 2026-01-06 06:47:07 0 105
Telangana
మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.
 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి...
By Sidhu Maroju 2025-07-06 17:03:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com