కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్

0
238

For scrolls

 

అమరావతి

 

*కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్*

 

• గత నాలుగు కలెక్టర్ల సదస్సుల్లో జీఎస్డీపీ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలపై రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం.

• గత పాలకుడు ఒకే ఒక కలెక్టర్ల సదస్సు నిర్వహించి తర్వాత ఆ కట్టడాన్ని కూల్చేశారు. అలాగే రాష్ట్రాన్ని కూడా ధ్వంసం చేశారు.

• ఇప్పుడు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి ఉంది. కూటమి ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ఏపీకి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. 

• రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 లాంటి కార్యక్రమాల్ని ముందుకు తీసుకువెళ్తున్నాం.

• ఒకటే జెండా, అజెండా ప్రతీ ఇంటికీ సంపద, అభివృద్ధి చేరాలన్నదే లక్ష్యం.

• ప్రజలంతా ప్రభుత్వం అంటే కలెక్టర్లే అనుకుంటారు. అందుకే అత్యంత జాగ్రత్తగా పాలన అందించాలి.

• కొందరు నేతలు దొంగతనాల్ని కూడా సమర్థిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది.

• ఇలాంటి విషయాల్లో అందరూ సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

• ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కలెక్టర్లు శ్రద్ధ పెట్టాలి.

• సోమవారం ఒక్కరోజే కాదు ప్రతీ రోజూ ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవాలి

• పారదర్శకంగా ప్రజలకు పాలన అందించాలని కలెక్టర్లు అందరినీ కోరుతున్నాను

• పరిశ్రమలకు ఇస్తున్న భూములను, ప్రజల నుంచి సేకరిస్తున్న భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేకుండా చూడాలి.

• ఇటీవల రెవెన్యూ సంస్కరణల్ని కూడా చేపట్టాం. క్షేత్రస్థాయిలో వాటిని సక్రమంగా అమలు చేసే బాధ్యతను కలెక్టర్లే తీసుకోవాలి.

• రీసర్వేను సమర్ధంగా నిర్వహించాలి. 

• 2 లక్షలకు పైగా జాయింట్ ఎల్ పీఎంల వివాదాలను పరిష్కరించండి

• 24 గంటలూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.

• అన్ని రంగాల్లో మెరుగైన పరిపాలన ఇవ్వాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది.

• గత పాలకుడు రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లాడు... భావితరాల కోసం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Search
Categories
Read More
Telangana
Palamooru rangareddy project
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన...
By G k Nookala 2026-05-19 08:50:58 0 161
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:22:02 0 146
Jharkhand
Jharkhand Issues Malaria Alert After Fatal Outbreak
The Jharkhand government has declared a statewide health alert following the tragic death of four...
By Lokeshwari Panthadi 2026-07-02 04:52:17 0 49
Andhra Pradesh
పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి...
By Pagadala Venkateswar 2026-04-11 06:41:14 0 106
Andhra Pradesh
కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో 77 వ  గణతంత్ర ...
By Hari Krishna 2026-01-26 08:36:59 0 530
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com