పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే

0
210

*Press Release*

 

*పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*

 

*ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది... ప్రభుత్వమే నిర్దేశిస్తుంది*

 

*పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే... ప్రైవేట్ రోడ్లు అవుతాయా?*

 

*విమర్శలు చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం*

 

*5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు*

 

*అమరావతి, డిసెంబర్ 17 :* పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా... అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.

Search
Categories
Read More
Telangana
హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్...
By Sidhu Maroju 2026-02-01 08:48:53 0 202
Telangana
నిజామాబాద్
Heartiest birthday wishes to the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji. Her...
By Sadaq Sadaq 2026-06-20 12:01:54 0 155
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 212
Mizoram
Kaladan Transit Project Advances Regional Connectivity
The Kaladan Multi-Modal Transit Transport Project is a major infrastructure initiative aimed at...
By Fathima Safa 2026-06-25 05:08:48 0 70
Telangana
మంచిర్యాల్: అదునపు జడ్జి శ్రీనివాస్ నాయక్ వీడ్కోలు
మంచిర్యాల్  బార్ అసోసియేషన్ న్యాయవాదుల పనితీరు అభినందనీయమని జిల్లా అదనపు జడ్జ్ శ్రీనివాస్...
By Bonagiri RaviShankar 2026-06-24 05:28:24 0 144
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com