పి పి పద్ధతిలో రోడ్లు వేస్తే ప్రైవేట్ రోడ్లు మారుతాయా మెడికల్ కాలేజీలు అంతే

0
119

*Press Release*

 

*పీపీపీ విధానంలోనే ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్నిస్తున్నాం*

 

*ప్రభుత్వమే నిబంధనలు పెడుతుంది... ప్రభుత్వమే నిర్దేశిస్తుంది*

 

*పీపీపీ పద్దతిన రోడ్ల నిర్మాణం చేపడితే... ప్రైవేట్ రోడ్లు అవుతాయా?*

 

*విమర్శలు చేస్తే భయపడం.. ప్రజలకు వాస్తవాలు చెబుతాం*

 

*5వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు*

 

*అమరావతి, డిసెంబర్ 17 :* పీపీపీ పద్దతిన నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలపై జరుగుతున్న దుష్ప్రచారంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నా... అవి ప్రభుత్వ కాలేజీల పేరుతోనే నడుస్తాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బుధవారం 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”పీపీపీ ద్వారా మెరుగ్గా సేవలు అందుతాయి. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారు. పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా... అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయి. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. 70 శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లో అందుతాయి, సీట్లు కూడా పెరుతాయి. రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు. ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను నిర్మించుకునేవాళ్లం. రుషికొండ ప్యాలెస్ ఇప్పుడు ఓ వైట్ ఎలిఫెంట్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోంది. విమర్శలు చేస్తే భయపడేది లేదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలి. రోడ్లను పీపీపీ ద్వారానే నిర్మిస్తున్నారు. కానీ అవి ప్రైవేటు వ్యక్తులది అయిపోతాయా?”అని చంద్రబాబు ప్రశ్నించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు 24-01-2026 Sat 14:14 | Andhra  ...
By Pagadala Venkateswar 2026-01-24 09:48:07 0 47
Andhra Pradesh
డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు:  ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్...
By Hari Krishna 2025-12-24 14:38:55 0 120
Andhra Pradesh
యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా లో ఉద్యోగాలు!!
కర్నూలు : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ - చెన్నై యూనిట్ వివిధ విభాగాల్లో 153 గ్రాడ్యుయేట్...
By Hari Krishna 2025-12-22 08:28:43 0 109
Andhra Pradesh
MLA రాము 10,000 మందికి అక్షయపాత్ర కేంద్రీయ వంటశాల
*కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం    ఎమ్మెల్యే రాము కృషితో... గుడివాడలో అక్షయపాత్ర...
By Rajini Kumari 2025-12-23 10:00:15 0 83
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 59
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com