హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|

0
154

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోకి మార్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు చేపట్టిన ఆందోళనకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కమిటీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

ఈ మేరకు సమస్యను వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ (DC) కి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా పేద ప్రజల వివాహాలు, శుభకార్యాలు, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలకు వేదికగా ఉన్న, ఈ కమ్యూనిటీ హాల్ ను యధావిధిగా కొనసాగించాలని వారు కోరారు. ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడికి మార్చడం వల్ల స్థానికులకు ఫంక్షన్ హాల్ సౌకర్యం దూరమవుతుందని, కావున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో.. అనిల్ కిషోర్, ప్రేమ్, అరుణ్, సెంథిల్, సెల్వరాజ్, రాజు, ముత్తు లక్ష్మి, విజయ్, రామానుజం, అముల్, సురేష్, మరియు ఇతర కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

 

 

Search
Categories
Read More
Telangana
నా కొడుక్కి బెయిల్ వస్తుంది.
చట్టం మీద నాకున్న గౌరవంతో నా కొడుకుని అప్పగించాను. కేసు నమోదు కాగానే స్టేషన్లో అప్పగించాలనుకున్నా...
By Ponnala Srinivasrao 2026-05-17 01:50:29 0 68
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
By Kothuru Murali 2026-01-11 11:27:17 0 129
Andhra Pradesh
లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశం
*Press Release*   *లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలి*   *వేగం మరింత...
By Rajini Kumari 2026-04-04 14:54:24 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com