విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు

0
121

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌

–4వ డివిజన్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

        విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

   మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనురాధ∙మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు. 

 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్‌వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. చిన్నతనం నుంచే మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారు మంచి ఆరోగ్యవంతులుగా తయారు అవుతారనే మంచి ఉద్దేశ్యంతో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ చక్కటి మెనును సిద్ధం చేశారని చెప్పారు. పాఠశాలలోనే స్టోర్‌ రూమ్‌ను కూడా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకుని పాఠశాలను మరింతగా అభివృద్థి చేస్తామని చెప్పడం అభినందనీయమనాన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు, నాయకులు పాతూరి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, రాజేష్, చలసాని రమణ, యేర్నేని వేదవ్యాస్, కోనేరు రాజేష్, కోడూరు ఆంజనేయవాసు, సురేంద్ర, బత్తుల దుర్గారావు, గద్దె రమేష్, కార్పోరేషన్‌ ఈఈ సామ్రాజ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పి.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...
By Kothuru Murali 2026-02-03 14:16:04 0 45
Telangana
మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల...
By Sidhu Maroju 2026-02-08 08:25:14 0 55
Andhra Pradesh
100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు.
🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్...
By John Baji 2026-01-11 04:34:04 0 92
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ‌ డ్రెంకెన్ డ్రైవ్ కేసు లు మొత్తం 444.
తిరుపతి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి . తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం ఎన్ని...
By Karapati Gopi 2026-01-01 09:58:23 0 244
Telangana
సూరారం పోలీసుల 'క్రైమ్ ఆపరేషన్' - లక్షల నగదు రికవరీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మొబైల్ ని దొంగిలించి...
By Sidhu Maroju 2026-02-03 14:18:38 0 63
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com