విద్యారంగంలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్ ని కొనియాడిన ఎమ్మెల్యేగద్దె రామ్మోహన్ రావు

0
237

విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్న నారా లోకేష్‌

–4వ డివిజన్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

+++++

 

        విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తూర్పు నియోజవకర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. 

 

   మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో రేగుల అనురాధ∙మున్సిపల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో అంగన్‌వాడీ స్కూల్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పరిశీలించారు. 

 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో నూతనంగా అంగన్‌వాడీ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి రూ.35 లక్షలను కేటాయించామన్నారు. ఈ అంగన్‌వాడీ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారన్నారు. చిన్నతనం నుంచే మంచి పౌష్టిక విలువలతో కూడిన ఆహారం అందించడం ద్వారా వారు మంచి ఆరోగ్యవంతులుగా తయారు అవుతారనే మంచి ఉద్దేశ్యంతో విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ చక్కటి మెనును సిద్ధం చేశారని చెప్పారు. పాఠశాలలోనే స్టోర్‌ రూమ్‌ను కూడా నిర్మాణం చేస్తున్నారన్నారు. ఈ పాఠశాలను అప్‌గ్రేడ్‌ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కలిసి నిధులు సమకూర్చుకుని పాఠశాలను మరింతగా అభివృద్థి చేస్తామని చెప్పడం అభినందనీయమనాన్నారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ విద్యారంగంలో అనేక విప్లవాత్మకమైన మార్పులను తీసుకు వస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. 

 

ఈ కార్యక్రమంలో కార్పోరేటర్‌ జాస్తి సాంబశివరావు, నాయకులు పాతూరి సాంబశివరావు, వడ్లపట్ల గోపాలకృష్ణ, రాజేష్, చలసాని రమణ, యేర్నేని వేదవ్యాస్, కోనేరు రాజేష్, కోడూరు ఆంజనేయవాసు, సురేంద్ర, బత్తుల దుర్గారావు, గద్దె రమేష్, కార్పోరేషన్‌ ఈఈ సామ్రాజ్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. పి.వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
పెద్దపల్లి లో గంజాయి రవాణా చేస్తున్న మహిళ అరెస్ట్...!
పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి  తరలిస్తున్న మహారాష్ట్ర చంద్రపూర్ చెందిన ఆరే...
By Sunka Santhosh 2026-06-10 18:17:30 0 93
Telangana
అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ...
By Sidhu Maroju 2026-03-12 08:01:10 0 166
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షేర్ ఆటో
పుంగనూరు మండలం, గడ్డురు చెరువు వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు...
By Kothuru Murali 2026-02-17 07:55:06 0 163
Andhra Pradesh
ఎంఎస్ బేగ్ ని కలిసిన నవ్యాంధ్ర రచయిత సంఘం నాయకులు
*ఎంఎస్ బేగ్ ను కలిసిన నవ్యాంధ్ర రచయితల సంఘం నాయకులు*   విజయవాడ పశ్చిమ ఫిబ్రవరి 21 :...
By Rajini Kumari 2026-02-21 17:11:58 0 140
Telangana
గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్ జిల్లా: జనవరి 5(భారత్ అవాజ్):జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్,...
By Bheeshman King 2026-01-05 14:04:35 0 396
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com