గ్రీవెన్స్ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి:: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

0
398

మహబూబాబాద్ జిల్లా: జనవరి 5(భారత్ అవాజ్):జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె.అనిల్ కుమార్, అన్ని విభాగాల అధికారులతో కలిసి కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు సూచించారు. మొత్తం ( 72 ) దరఖాస్తులు వచ్చాయని అందులో అందులో రెవిన్యూ శాఖ 35, మున్సిపాలిటీ 13, పంచాయతీ రాజ్ శాఖ 05, జిల్లా అభివృద్ధి సంస్థ 05, గృహ నిర్మాణ శాఖ 03, గిరిజన సంక్షేమ శాఖ 02 చొప్పున వివిధ శాఖలకు దరఖాస్తులు వచ్చాయి.

 మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన పర్వతపోజు సుమలత తాను క్రాఫ్ట్ కోర్సు పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని తనకు కంబాలపల్లి పాటశాలలో ఖాళీగా ఉన్న క్రాఫ్ట్ టీచర్ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.

మహబూబాబాద్ పట్టణంలోని జగ్జీవన్ రాం నగర్ కాలనీ కి చెందిన అనంతుల కళ్యాణి మొదటి జాబితాలో తన పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినదని అట్టి మంజూరు అయినటువంటి ఇందిరమ్మ ఇల్లు ను ఇప్పించాలని కోరారు.

సీరోలు మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన బానోత్ ప్రవీణ్ తనకు గత సంవత్సరం గిఫ్ట్ డీడ్ క్రింద భూమి రిజిస్ట్రేషన్ అయిందని అట్టి భూమి యొక్క పాసు పుస్తకాలని ఇప్పించాలని కోరారు.

గూడూరు మండలం నాయకపల్లి గ్రామానికి చెందిన కోడి స్రావంతి తనకు వికలాంగుల సర్టిఫికేట్ వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంతవరకు వికలాంగుల పెన్షన్ పొందట్లేదని అట్టి వికలాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరారు.

ఈ ప్రజావాణి కార్యక్రమంలో డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.మధుసూదన రాజు, జడ్పీ సీఈవో పురుషోత్తం, జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఏడి ఎస్ఎల్ఆర్ నరసింహ మూర్తి, జిల్లా ఉద్యానవన అధికారి జి. మరియన్నా, డిపిఓ హరిప్రసాద్, ఎస్సీ,బిసి, ఎస్టీ, మైనార్టీ అధికారులు శ్రీనివాస్, దేశీ రామ్ నాయక్, పరిశ్రమల అధికారి శ్రీమన్నారాయణ, సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ కృష్ణవేణి, సిపిఓ శ్రీనివాస్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హన్మనాయక్, వెల్ఫేర్ అధికారిని సబిత, సివిల్ సప్లై అధికారి రమేష్, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ రజిత, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయ, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, పర్యవేక్షకులు మదన్ గోపాల్, రాజేష్, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.
AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ...
By Pagadala Venkateswar 2026-01-23 07:00:17 0 159
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 334
Andhra Pradesh
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఘన నివాళులు
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు...
By Benguluri Madhubabu 2026-01-18 06:36:15 0 304
Andhra Pradesh
ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - జూనియర్ సివిల్ జడ్జి.
మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత...
By Pagadala Venkateswar 2026-01-25 13:16:17 0 185
Andhra Pradesh
విజయవాడ అంటేనే విద్యల వాడ ఎంపీ కేసినేని శివనాథ్
*ప్రెస్ నోట్*   *30-5-2026*   *విజయవాడ అంటేనే విద్యలవాడ - ఎంపీ కేశినేని శివనాథ్*...
By Rajini Kumari 2026-05-30 11:52:39 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com