అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
165

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా అండగా నిలవాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి ప్రభుత్వ ఫలాలు అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రాములు,  తెలంగాణ రాష్ట్ర ఎంబీసి (MBC) కార్పొరేషన్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్  పాల్గొన్నారు.

నందికంటి శ్రీధర్  మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో మల్కాజిగిరి నియోజకవర్గం ముందుంటుందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస్ రెడ్డి, సబిత అనిల్ కిషోర్ గౌడ్ స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమకు ఆర్థిక వెసులుబాటు కల్పించినందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?
కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు… ‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ...
By Ponnala Srinivasrao 2026-04-26 02:36:38 0 118
Delhi - NCR
Home Ministry Launches Four Digital Apps for Smart Policing
The Union Ministry of Home Affairs has unveiled four transformative pan-India digital platforms...
By Lokeshwari Panthadi 2026-06-25 10:51:29 0 117
Telangana
కూకట్పల్లి ఆర్టీసీ బస్సు డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయింపు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించే దిశగా కూకట్‌పల్లి డిపోకు 60...
By Jagadeesh Babu 2026-05-27 15:02:04 0 251
Business & Finance
Vizhinjam Port Expands Cargo Operations in Kerala
The Vizhinjam International Seaport continues to expand its cargo handling operations,...
By Navya Sree 2026-06-30 07:51:53 0 80
Andhra Pradesh
పుంగనూరు: సబ్ రిజిస్టార్ పై రూ. 70 వేల ముడుపులు ఆరోపణలు..
పుంగనూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఒక నివాస గృహ రిజిస్ట్రేషన్ సమయంలో సబ్...
By Kothuru Murali 2026-06-30 16:32:08 0 98
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com