25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి

0
219

25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-

ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర చరిత్రలోనే మైలురాయి-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్-

 

విజయవాడ- 16 డిసెంబర్ 2025-

 

ఖరిఫ్ 2025–26 సీజన్‌లో మునుపెన్నడూ లేని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ద్వారా 16 డిసెంబర్ 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 3,96,854 మంది రైతుల నుండి రూ.5,938.20 కోట్ల విలువ గల 25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే చెప్పుకోదగ్గ మైలురాయిగా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

 

ఇప్పటివరకు 3,79,538 మంది రైతులకు రూ.5,682.77 కోట్ల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన రూ.255.43 కోట్ల రూపాయలు తదుపరి బ్యాంకు బ్యాచ్ ప్రాసెస్‌లో రైతుల ఖాతాల్లో జమ చేయబడతాయని తెలిపారు.

 

రైతులకు మద్దతు ధర (MSP) అందించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

 

రైతులు తమ ధాన్యం విక్రయంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే, విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెం: 1967 ను సంప్రదించవచ్చని, ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాల మేరకు 24 గంటల లోపు మద్దతు ధర (MSP) పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

రాష్ట్రవ్యాప్తంగా 3,500 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధరకన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే తమ ధాన్యాన్ని విక్రయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఎలిజిబెత్ రేఖ ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి(సి.ఐ.టి.యు)
బాపట్ల జిల్లా: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి కార్మికులను వీధుల పాలు...
By Gadiyapudi Narendra 2026-02-24 16:53:13 0 311
Andhra Pradesh
సోమల స్వయంబేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవాలకు సర్వం సిద్ధం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల కేంద్రంలో కొలువైన స్వయంభేశ్వరస్వామి వారి ఆలయంలో ఉత్సవాలకు సర్వం...
By Kothuru Murali 2026-04-13 08:20:26 0 104
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాదంలో సేవలందించిన ఎస్ఐ, ఎంపీడీవోలకు సన్మానం
వేట్లపాలెం బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొన్న పెద్దాపురం ఎస్ఐ మౌనిక,...
By Ratna Sekhar 2026-03-11 07:43:33 0 1K
Andhra Pradesh
రాయచోటిలో జనసేన నాయకులు నాగభూషణ్ ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఈరోజు రాయచోటి లో పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సీనియర్ నాయకులు బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో జనసేన...
By Benguluri Madhubabu 2026-02-25 07:12:55 0 201
Andhra Pradesh
మదనపల్లి: రైతులు ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ,...
By Pagadala Venkateswar 2026-02-04 07:18:31 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com