విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ

0
281

*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*

 

*ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*

 

విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన తనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలి దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. 2008లో వీసీఐసీ ఫేజ్-1లో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పునరావాసం కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో విశాఖ ఏపీహెచ్ బీ లే అవుట్ లోని తమ 70వ నెంబర్ ఫ్లాట్ ను ఆక్రమించారని, విచారించి న్యాయం చేయాలని ఎస్.వెంకట లావణ్య కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 232
Telangana
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(TCA) జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ప్రెస్ మీట్ .|
సికింద్రాబాద్ :తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) జనరల్ సెక్రెటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్...
By Sidhu Maroju 2025-12-19 13:57:24 0 225
Andhra Pradesh
లెఫ్ట్ పార్టీస్ ప్రెస్ స్టేట్మెంట్
వామపక్ష పార్టీలు ప్రచురణార్ధం/ప్రసారార్ధం :          విజయవాడ, తేది :...
By Rajini Kumari 2025-12-18 11:40:16 0 213
Telangana
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల...
By Sidhu Maroju 2025-11-08 06:45:20 0 285
Andhra Pradesh
ఎవర్రా మీరంతా.! పైకి చూసి డెలివరీ పార్శిళ్లు పికప్ అనుకునేరు.. అసలు యవ్వారం వేరుంది
దొంగతనం కూడా దర్జాగా చేసేస్తున్నారు ఇక్కడ ఇద్దరు యువకులు. అది కూడా నడిరోడ్డు మీద అందరూ...
By SivaNagendra Annapareddy 2025-12-16 08:40:01 0 330
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com