విశాఖలో మంత్రి లోకేష్ ప్రజల అర్జీలు స్వీకరణ

0
166

*విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*

 

*ప్రజలను కలిసి అర్జీలు స్వీకరణ*

 

విశాఖపట్నం: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉదయం 78వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖపట్నం కంచరపాలెంలోని ఓల్డ్ ఐటీఐలో ట్రైనింగ్ ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందిన తనకు రిటైర్ మెంట్ బెనిఫిట్స్ త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలని లంకిరెడ్డి సతీశ్వరరెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తైనదీవిలో తన 20 సెంట్ల భూమిని ఆక్రమించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, విచారించి తగిన న్యాయం చేయాలని గాలి దుర్గమ్మ విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని బాధితులు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. 2008లో వీసీఐసీ ఫేజ్-1లో భాగంగా పరిశ్రమల అభివృద్ధి కోసం ఏపీఐఐసీ భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పునరావాసం కల్పించలేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో విశాఖ ఏపీహెచ్ బీ లే అవుట్ లోని తమ 70వ నెంబర్ ఫ్లాట్ ను ఆక్రమించారని, విచారించి న్యాయం చేయాలని ఎస్.వెంకట లావణ్య కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
Telangana
సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU
  ​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ...
By Bittu Bittu 2026-02-03 11:49:44 0 587
Telangana
పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది
పాలకుర్తి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో ఝాన్సీ రెడ్డి కోట్ల రూపాయలు దండుకుంది  ...
By Ellandula Sandeep 2026-01-08 08:05:06 0 146
Odisha
Odisha NMMS Exam 2025 Registration Closes Today |
The registration for the Odisha NMMS Exam 2025 closes today. Scheduled for 7 December 2025, the...
By Pooja Patil 2025-09-16 06:41:54 0 131
Andhra Pradesh
పౌర్ణమి సందర్భంగా కోనేటిరాయునికి పుంగనూరులో గరుడ సేవ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి టిటిడి...
By Kothuru Murali 2026-01-04 10:57:34 0 79
Andhra Pradesh
Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి ...
By Pagadala Venkateswar 2026-02-04 07:42:22 0 34
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com