సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU

0
1K

 

​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డీఏలను చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని తెలిపారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు రూ. 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులలో భాగంగా ఈ నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో TSCPSEU మండల అధ్యక్షుడు వాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ, మండల బాధ్యులు జాడి ప్రభాకర్, సుభాష్, మహిళా కార్యదర్శి రాజేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీపీఎస్ సంఘ బాధ్యులు, మరియు పలువురు సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
విజయనగరం జిల్లా సెషన్స్ జడ్జిగా నిర్మల
రాష్ట్రంలో వివిధ కోర్టులలో సివిల్ జడ్జ్ సీనియర్ డివిజనల్గా పనిచేస్తున్న15 మందికి జిల్లా సెషన్స్...
By Boiena Rajesh 2026-04-12 00:17:57 0 160
Gujarat
Patan Braces for Monsoon Amid Blocked Drainage Fears
With the monsoon season fast approaching, residents of Chansma in Gujarat’s Patan district...
By Lokeshwari Panthadi 2026-06-27 08:50:40 0 80
Haryana
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT
Supreme Court Eases Restrictions on Ashoka Professor, Criticizes Haryana SIT The Supreme Court...
By Bharat Aawaz 2025-07-17 06:43:42 0 2K
Andhra Pradesh
Jayaprakash Narayan: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్... స్పందించిన జయప్రకాశ్ నారాయణ.
Andhra   Jayaprakash Narayan Praises Greenkos Kakinada Green Energy Complex...
By Pagadala Venkateswar 2026-01-17 11:30:38 0 184
Telangana
ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ప్రజలకు సమాజంలో భద్రత కల్పించేది పోలీసులే. పోలీసులు లేని సమాజాన్ని...
By Sidhu Maroju 2025-10-21 10:38:28 0 297
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com