సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి: TSCPSEU

0
1K

 

​కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 4: తెలంగాణ రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ (TSCPSEU) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రవిచంద్ర డిమాండ్ చేశారు. సోమవారం కొత్తగూడ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏలను వాయిదాల రూపంలో చెల్లించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో డీఏలను చెల్లించకుండా వాయిదాల సంఖ్యను పెంచుకుంటూ పోవడం వల్ల ప్రస్తుతం అవి 60కి చేరాయని తెలిపారు. ఈ వాయిదాల ద్వారా రావలసిన మొత్తం సుమారు రూ. 1200 కోట్లకు చేరడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

​ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేస్తున్న రూ. 700 కోట్ల నిధులలో భాగంగా ఈ నెల తప్పనిసరిగా సీపీఎస్ బకాయిల కోసం కేటాయించాలని కోరారు. అలాగే గత ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణలో పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో TSCPSEU మండల అధ్యక్షుడు వాసం ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి సువర్ణపాక కృష్ణ, మండల బాధ్యులు జాడి ప్రభాకర్, సుభాష్, మహిళా కార్యదర్శి రాజేంద్ర, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీపీఎస్ సంఘ బాధ్యులు, మరియు పలువురు సీపీఎస్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Like
1
Search
Categories
Read More
Telangana
ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు ఈ మౌనం ?
ఏంటి Kalvakuntla Kavitha అక్కో  ‎తెలంగాణకి అమ్మ అవుతా అన్నావ్  ‎ఒక కూతురు...
By Ponnala Srinivasrao 2026-05-10 02:06:17 0 116
Andhra Pradesh
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
By Pagadala Venkateswar 2026-01-15 07:04:20 0 175
Andhra Pradesh
432 రైతులకు భూహక్కుల పాస్ పుస్తకాలు ఎమ్మెల్యే సౌమ్య పంపిణీ
'మీ భూమి – మీ హక్కు' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య   నందిగామ, జూలై...
By Patan Khuddus 2026-07-06 17:05:43 0 100
Telangana
"అభివృద్ధి కాదు సమస్య... అభివృద్ధి చేసే విధానమే అసలు ప్రశ్న."
హైదరాబాద్ : ఒకప్పుడు నగరాల అభివృద్ధిని కొలవడానికి భారీ భవనాలు, విశాలమైన రహదారులు, కొత్త...
By Sidhu Maroju 2026-06-04 07:05:06 0 248
Andhra Pradesh
పరాయి మోజులో పడి.. రుబ్బురాయితో భర్తను హతమార్చిన భార్య!
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్యే భర్తను హత్య చేసిన ఘటన మదనపల్లెలో వెలుగు...
By Pagadala Venkateswar 2026-07-01 04:49:06 0 65
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com