Jagan Mohan Reddy: జగన్‌పై ముద్రగడ కుమార్తె తీవ్ర వ్యాఖ్యలు

0
116

కూటమి ప్రభుత్వ హయాంలోని అభివృద్ధిని జగన్ తట్టుకోలేకపోతున్నారన్న ముద్రగడ కుమార్తె క్రాంతి 

జగన్ రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణ

ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న క్రాంతి

 

ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్, తన తండ్రి ముద్రగడపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతుండటాన్ని తట్టుకోలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అభద్రతాభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. 

 

జగన్ రాజకీయ లాభాల కోసం కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేసి రెడ్లకు అప్పగించి, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాతే కాపులు గుర్తొస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మాజీ మంత్రి అంబటి రాంబాబును ముందు పెట్టి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇదే తరహాలో రేపు తన తండ్రి ముద్రగడను కూడా అలా చేయరని గ్యారెంటీ ఉందా? అని ఆమె వ్యాఖ్యానించారు. 

 

తిరుమల లడ్డూ అంశంపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ ఛార్జిషీట్‌లో స్పష్టంగా పేర్కొన్నా, అసలు ఏమీ జరగలేదని ముద్రగడ ఎలా చెప్పగలుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. అదేవిధంగా, పాదయాత్ర సమయంలో కాపులకు ఏటా రూ.2 వేల కోట్లు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కారని, అలాంటి వ్యక్తికి తన తండ్రి ముద్రగడ మద్దతివ్వడం ఆశ్చర్యంగా ఉందని క్రాంతి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విద్యార్థుల వేదన కదిలించింది
విద్యార్ధుల వేదన కదిలించింది   • సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప...
By Rajini Kumari 2026-02-07 11:56:02 0 129
Telangana
నిజామాబాద్
ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు...
By Sadaq Sadaq 2026-05-17 17:13:09 0 37
Telangana
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం.
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు....
By Vanmoj Suryamohan 2025-12-24 09:57:50 0 384
Andhra Pradesh
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను...
By Benguluri Madhubabu 2026-04-04 13:32:26 0 249
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 340
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com