జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి

0
136

జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి

 

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020కు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షులు ఆదర్శ ఎం సాజి తెలిపారు. కచీఫ్ ఆడిటోరియంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఈ విధానం ద్వారా దేశంలోని విద్యా వ్యవస్థను “వ్యాపారీకరణ, కేంద్రీకరణ, మతీకరణ” చేయాలని ప్రయత్నిస్తున్నదని వారు ఆరోపించారు.

రాష్ట్రంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడిన విద్యార్థి నేతలు, గత కొన్ని సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా దాదాపు 89 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో 65 లక్షలకు పైగా విద్యార్థులు చదువులు మానేశారని, ఇది ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేయడం వల్లే జరిగిందని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనే 12 వేలకుపైగా పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే నడుస్తున్నాయని, ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులు, అన్ని విషయాలు బోధించాల్సి రావడం వల్ల పేద, అణగారిన వర్గాల పిల్లల విద్యా నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోందని తెలిపారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రభుత్వ విద్యను క్రమంగా “విచ్ఛిన్నం” చేస్తోందని ఆరోపించారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఫీజుల పెంపు, స్కాలర్‌షిప్‌ల కోతలతో విద్యను డబ్బు ఉన్నవారికే పరిమితం చేస్తున్నారని అన్నారు. దీంతో వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక భారాలు పెరుగుతున్నాయని తెలిపారు.

ఇటీవలి కార్మిక చట్టాల మార్పులను కూడా వారు విమర్శించారు. ఇవి కార్మికులు, యువత, విద్యార్థులపై దాడిగా మారాయని, సాధారణ ప్రజల సంక్షేమంపై కేంద్రానికి నిజమైన నిబద్ధత లేదని ఆరోపించారు.

 

పాఠ్యపుస్తకాల్లో మార్పుల పేరుతో చరిత్రను “వక్రీకరించే” ప్రయత్నాలు జరుగుతున్నాయని సమావేశం తీవ్రంగా ఖండించిందన్నారు. భగత్‌సింగ్, డా. బీఆర్ అంబేడ్కర్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల పాఠాలను తొలగించి, వి.డి. సావర్కర్ వంటి వారిని జాతీయ నాయకులుగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. అలాగే హిందుత్వ భావజాలం, అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి తీసుకువచ్చి శాస్త్రీయ దృక్పథం, లౌకిక విలువలను దెబ్బతీస్తున్నారని అన్నారు.

ఎన్‌ఈపీ–2020ను వారు “జాతీయ బహిష్కరణ విధానం”గా అభివర్ణిస్తూ, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో ఉద్యమాలను కొనసాగిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ సమావేశం రాష్ట్రం మొత్తంలోనే కాక దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో పోరాటాలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

విద్య హక్కుగా కొనసాగాలే తప్ప ఆదాయంపై ఆధారపడి ఉండే ప్రత్యేక హక్కుగా మారకూడదని వారు స్పష్టం చేశారు. ఇందుకోసం విద్యార్థులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు ఐక్య ఉద్యమానికి రావాలని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కే ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మొదటిరోజు తిరుపతి నగరంలో ఉత్సాహంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో కోటను ప్రభుత్వం తీసుకొస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటుకరణ కు వ్యతిరేకంగా ఉద్యమించాలని మహాసభ తీర్మానించిందని తెలిపారు. 8000 కోట్ల బకాయిలకు చేరిన ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, కార్యదర్శి భగత్ రవి పాల్గొన్నారు.

Search
Categories
Read More
Mizoram
PM Lays Foundation for PMJVK Development Projects in Siaha, Mizoram
On July 16, 2025, Union Minister George Kurian virtually inaugurated two new infrastructure...
By Bharat Aawaz 2025-07-17 07:05:03 0 1K
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-20 11:03:54 0 127
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు...
By Kothuru Murali 2026-01-22 11:49:40 0 119
Ladakh
Ladakh Sets Up First Eco-Friendly Ice Stupa Park in Nubra Valley
To combat water scarcity during spring and promote eco-tourism, Ladakh has established its first...
By Bharat Aawaz 2025-07-17 06:35:55 0 986
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com