పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి బాలింత మృతి

0
303

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ బాలింత మృతి పై ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గూడూరు మండలంలోని పెంచికలపాడు విశ్వ భారతి ఆసుపత్రిలో వైద్యం వికటించి బాలింత వెంకటలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగి రోడ్డుపై బైఠాయించారు. సంఘటనకు సంబంధించి సి. బెళగల్ మండలంలోని కె సింగవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని రెండేళ్ల కిందట కోడుమూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన వ్యక్తితో కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు. వెంకటలక్ష్మికి తొలి ప్రసవం కావడంతో పుట్టినిల్లు అయిన కె లింగవరం గ్రామానికి రావడం జరిగింది. రెండు రోజుల కిందట ప్రసాదం కొరకు పెంచికలపాడు లోని విశ్వ భారతి ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లి చేర్పించారు. గురువారం వైద్యులు వెంకటలక్ష్మికి సిజేరియన్ చేయడంతో ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత వెంకటలక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు మరో మారు ఆపరేషన్ నిర్వహించగా కోలుకోలేక మృతి చెందింది. తమ బిడ్డకు వైద్యులు సరైన వైద్యం చేయకపోవడం కారణంగానే మృతి చెందిందని ఆరోపిస్తూ ఆందోళనకు కుటుంబ సభ్యులకు దిగారు. వెంకటలక్ష్మి మృతిచెందరం పట్ల వైద్యుల నిర్లక్ష్యం ఉందంటూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఇబ్బందితో ఆసుపత్రికి చేరుకొని వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
* జర్నలిస్టుపై వేధింపులు ఖండించండి..* ప్రజా సంఘాల పిలుపు..*
*జర్నలిస్టులపై వేధింపులు ఖండించండి..*  - *ప్రజా సంఘాల పిలుపు..*   *ఒంగోలు//కలం...
By Chennaiah Kati 2026-02-04 07:10:28 0 97
Andhra Pradesh
విద్యార్థుల వేదన కదిలించింది
విద్యార్ధుల వేదన కదిలించింది   • సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప...
By Rajini Kumari 2026-02-07 11:56:02 0 39
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS
*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️‍♂️🏌️‍♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ,...
By Rajini Kumari 2025-12-21 08:49:02 0 166
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 100
Gujarat
CM Bhupendra Patel’s 4-Year Tenure Progress or Politics
On September 13, Gujarat Chief Minister Bhupendra Patel completed four years in office,...
By Pooja Patil 2025-09-13 13:08:23 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com