రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక

0
212

రాత్రి వేళల్లో విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు - నైట్ మానిటరింగ్‌లో సిబ్బందికి ఒంగోలు డీఎస్పీ హెచ్చరిక

ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, రాత్రి వేళల్లో నేరాలను అరికట్టడం లక్ష్యంగా డిస్ట్రిక్ నైట్ మానిటరింగ్ ఆఫీసర్ హోదాలో ఒంగోలు డీఎస్పీ గారు తాలూకా పోలీస్ స్టేషన్‌తో పాటు బీట్స్, బ్లూ కోర్స్‌లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తాలూకా పీఎస్ పరిధిలోని నైట్ బీట్ సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించి, రాత్రి పహారా, పికెటింగ్, మొబైల్ గస్తీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. బ్లూ కోర్స్ సిబ్బంది విధులు, రాత్రి సమయంలో స్పందన, గస్తీ నిర్వహణ తీరును పరిశీలించి, ప్రజల భద్రతకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా విధులు నిర్వర్తించాలని సూచనలు చేశారు.

డీఎస్పీ గారు మాట్లాడుతూ, రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కఠిన నిఘా ఉంచాలని, ముఖ్య కూడళ్లు, నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాల్లో గస్తీ మరింత పెంచాలని ఆదేశించారు. నైట్ బీట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయేలా భద్రత కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరించి, రాత్రి వేళల్లో ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శాంతియుతమైన, సురక్షితమైన ప్రకాశం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్...
By Vadlamudi NagaVenkat 2026-03-11 15:35:29 0 764
Andhra Pradesh
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...
By Pagadala Venkateswar 2026-05-05 06:23:19 0 98
Telangana
తెలంగాణలోని పది జిల్లాల రద్దు ఆలోచనలో ప్రభుత్వం?.|
    హైదరాబాద్ : త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అసెంబ్లీలో మంత్రి...
By Sidhu Maroju 2026-01-07 14:41:26 0 196
Goa
Goa Monsoon Safety: Swimming Banned in Natural Water Bodies
In a critical move to ensure public safety during the turbulent monsoon season, the District...
By Lokeshwari Panthadi 2026-06-30 04:21:41 0 74
Andhra Pradesh
ఇంటర్మీడియట్ లో అత్యంత మార్కుల సాధించిన విద్యార్థులను అభినందించిన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
పట్టుదలతో చదివితే ప్రతిరోజు విజయమే విద్యార్థులు ఉన్నస్తాయి చేరుకోవడానికి చదివే ప్రధాన మార్గమని...
By Benguluri Madhubabu 2026-04-18 14:15:26 0 277
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com