మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.|

0
153

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు విశేషంగా కృషి చేసి, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) పరిధిలోని బాచుపల్లి సాయి నగర్ లో మహాత్మా ఫూలే విగ్రహానికి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్.ఎం.సి. బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు సాంబశివరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ, మహాత్మా ఫూలే ఆశయాలను, ఆయన చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, అప్పుడే ఆయనకు సరైన నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలగం చంద్రయ్య,రామ్ నరసయ్య, ఆంజనేయులు,కురుమూర్తి, నర్సింగ్, నాయకురాలు భారతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని సోగనూరు రోడ్ వద్ద నిర్మించిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-03-31 00:09:20 0 111
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు జగన్ ఫోన్‌... పార్టీ మొత్తం అండగా ఉంటుందని భరోసా.
అంబటిని ఫోన్‌లో పరామర్శించిన జగన్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని తీవ్ర విమర్శ  ...
By Pagadala Venkateswar 2026-02-01 08:45:55 0 93
Andhra Pradesh
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న మిథున్‌రెడ్డి   23న విచారణకు రావాలని...
By Pagadala Venkateswar 2026-01-19 06:52:25 0 124
Andhra Pradesh
శ్రీకాకుళం: ఉత్సాహంగా కొనసాగుతున్న క్రీడల పోటీలు
శ్రీకాకుళం రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కోడి రామ్మూర్తి స్టేడియంలో శనివారం రెండో రోజు క్రీడల...
By Manda Ramkumar 2026-03-28 09:27:22 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com