Jagan Mohan Reddy: జగన్ గుంటూరు పర్యటన... పలువురు నేతలపై కేసులు నమోదు.

0
182

గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించిన జగన్

జగన్ పర్యటన సందర్భంగా ర్యాలీలు నిర్వహించిన పలువురు వైసీపీ నేతలు

ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారంటూ కేసులు నమోదు

అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత చేపట్టిన గుంటూరు పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు హల్ చల్ చేశారు. పోలీసు యాక్ట్ 30ను పట్టించుకోకుండా అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించారు. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.  

 

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నల్లపాడులో పోతిన మహేశ్, బలసాని కిరణ్ కుమార్ పై కేసు నమోదయింది. మంగళగిరిలో నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, తాడేపల్లిలో దొంతిరెడ్డి వేమారెడ్డిపై, నగరంపాలెం ప్రాంతంలో పానుగంటి చైతన్య, నూరి ఫాతిమా, గుంటూరు పట్టాభిపురంలో అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి. 

 

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ... వైసీపీ నేతలు చేపట్టిన ర్యాలీల కారణంగా గుంటూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. పోలీసు నిబంధనలను ఉల్లంఘించడం, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ క్రమంలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బొలెరో ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు: ఆసుపత్రికి తరలింపు
చిత్తూరు జిల్లా గంగవరం మండలం గుండుగల్లుకు చెందిన ఆనంద్ (40) బుధవారం రాత్రి పుంగనూరు - చౌడేపల్లె...
By Kothuru Murali 2026-02-26 12:42:46 0 147
Andhra Pradesh
జాఫర్, రమేష్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
అయ్యప్ప సేవా సమితి సేవలు అదర్శనీయం మజ్జిగ పంపిణీ చేసిన జాఫర్.రమేష్ నందిగామ,ఏప్రిల్,20,(భారత్...
By Patan Khuddus 2026-04-21 06:51:01 0 282
SURAKSHA
Gujarat Police Elite Specialized Units Secure the State
The Gujarat Police maintains an exceptionally formidable defense network through its highly...
By Lokeshwari Panthadi 2026-07-04 06:05:36 0 61
Business & Finance
హైదరాబాద్‌లో బంగారం ధరలు అధిక స్థాయిలో కొనసాగుతున్నాయి
హైదరాబాద్‌లో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, దేశీయ డిమాండ్ ప్రభావంతో అధిక స్థాయిలో...
By Navya Sree 2026-07-03 07:29:14 0 45
Andhra Pradesh
నకిలీ పత్రాలతో భూమి కబ్జా యత్నం: బాధితుల ఆరోపణలు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, దిగువపల్లి పంచాయతీ బోయకొండ గంగాపురం ప్రాంతానికి చెందిన మోపురి పద్మ,...
By Pagadala Venkateswar 2026-04-08 12:46:58 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com