మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి - నివాళులు అర్పించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.|

0
175

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిజాంపేట్ >  భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యకు విశేషంగా కృషి చేసి, సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిగా నిలిచిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసి) పరిధిలోని బాచుపల్లి సాయి నగర్ లో మహాత్మా ఫూలే విగ్రహానికి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్.ఎం.సి. బి.ఆర్.ఎస్. పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, నాయకులు సాంబశివరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

వారు మాట్లాడుతూ, మహాత్మా ఫూలే ఆశయాలను, ఆయన చూపిన బాటను ప్రతి ఒక్కరూ అనుసరించాలని, అప్పుడే ఆయనకు సరైన నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జలగం చంద్రయ్య,రామ్ నరసయ్య, ఆంజనేయులు,కురుమూర్తి, నర్సింగ్, నాయకురాలు భారతి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష...
By Ponnala Srinivasrao 2026-05-20 05:16:19 0 57
Andhra Pradesh
కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన...
By Jeeru Kumar 2026-03-01 06:31:32 0 683
Andhra Pradesh
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ 24-12-2025   ప్రచురణార్థం   *సెమి క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ మంత్రి...
By Rajini Kumari 2025-12-25 08:01:13 0 241
Telangana
స్వర్గీయ ఇందిరా గాంధీ 108 వ జయంతి— నివాళులు అర్పించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి...
By Sidhu Maroju 2025-11-19 07:37:40 0 178
Telangana
రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్...
By Sidhu Maroju 2025-12-29 16:04:15 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com