పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు

0
250

మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని అర్జీని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ హయాంలో గడప గడపకు మన ప్రభుత్వం కింద ఒక్కో సచివాలయానికి అభివృద్ధి పనులు కొరకు ప్రభుత్వంరూ.20 లక్షలలు మంజూరు చేసిందన్నారు. స్థానిక ఎస్సీ కాలనీలో అభివృద్ధి పనులు చేసేందుకు అప్పటి ఎంపీడీవో సమక్షంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లు పనుల అగ్రిమెంట్ను తనతో చేయించుకోవడంతో రూ 20 లక్షలు అప్పులు తెచ్చి మూడు కిలోమీటర్ల మేరకు కొత్త తాగునీటికి పైప్లైన్, 12కి పైగా కాలనీలో మినీ ట్యాంకులు, బోర్లకు విద్యుత్ మోటర్లు వంటి వాటి ఏర్పాటుకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కాలనీలో పనులు పూర్తయి మూడేళ్లు అవుతున్న ఇప్పటివరకు కేవలం అధికారులు నాలుగు లక్షల వరకు బిల్లులు మంజూరు చేయగా మిగిలిన రూ 16 లక్షల బిల్లులు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. పనులకు సంబంధించిన ఏం బుక్, వర్క్ అగ్రిమెంట్లు, పనికి సంబంధించిన ఎస్టిమేషన్ కాపీలను అందించకుండా కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎంపీడీవో స్పందించి తనకు రావాల్సిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని ఆయన కోరారు. .

Search
Categories
Read More
Telangana
పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ...
By Sidhu Maroju 2026-01-18 10:19:09 0 163
Andhra Pradesh
44వ జాతీయ యోగ చాంపియన్ షిప్ 2025-26 ప్రారంభోత్సవ కార్యక్రమం..
జిల్లెలమూడి శ్రీవిశ్వ జనని పరిషత్... అమ్మ ప్రాంగణంనందు ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. బాపట్ల :...
By Gadiyapudi Narendra 2025-12-27 11:05:28 0 382
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 185
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com