ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

0
187

*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*

 

తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ‌

ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ది శిక్షణ

 

విజ‌య‌వాడ : ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో కేశినేని ఫౌండేష‌న్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల పాటు నైపుణ్యాభివృద్ది శిక్ష‌ణ తీసుకునేందుకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా ఎస్.హెచ్.జి మ‌హిళ‌ల‌కు సోమ‌వారం శిక్ష‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం అయ్యాయి. 

 

ఎంపీ కేశినేని శివ‌నాథ్ సార‌ధ్యంలో 3వ బ్యాచ్ కింద వెళ్లిన ఎస్.హెచ్.జి మ‌హిళ‌లు 45 మందికి తేనె, వర్మి, ప్రకృతి సాగులో శిక్ష‌ణ ప్రారంభించారు. వీరిలో వ‌ర్మి కంపోస్టింగ్, నేచుర‌ల్ ఫార్మింగ్ లో 30 మందికి , తేనే త‌యారీ లో 15 మంది మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. 

 

ఎన్.ఐ.ఆర్.డిలో అపికల్చర్ టెక్నాల‌జీ సెంట‌ర్ కి చెందిన అధికారి ర‌వీంద్ర కుమార్ నేతృత్వంలో తేనెటీగల పెంపకం, తేనెటీగ జాతులు ప‌రిచ‌యం గురించి అవ‌గాహ‌న త‌ర‌గతులు నిర్వ‌హించారు. అనంత‌రం తేనేటీగ‌ల పెంప‌కానికి సంబంధించిన వ‌స్తువుల గురించి వాటి వినియోగం గురించి ప్రాక్టిక‌ల్ గా వివ‌రించారు. అలాగే వాటికి ఆహార తయారీ, ఫ్రేమ్‌ల శుభ్రపరిచే విధానం, సి.ఎఫ్ షీట్లు అమర్చడం, తేనెటీగల నిర్వహణ (హ్యాండ్లింగ్) పై శిక్ష‌ణ ఇచ్చారు. 

 

అలాగే వ‌ర్మి కంపోస్టింగ్, నేచుర‌ల్ ఫార్మింగ్ శిక్ష‌ణ కి సంబంధించి వ్య‌వ‌సాయ నిపుణుడు జి.శేఖ‌ర్ నేతృత్వంలో 

వర్మి కంపోస్టింగ్ సాంకేతిక‌త‌ పరిచయం, నేల పురుగుల (ఎర్త్‌వర్మ్) జీవచక్రం, సేంద్రియ వ్యర్థాల (ఇన్‌పుట్స్) ఎంపిక , ప్రదేశం ఎంపికల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌రం బెడ్డింగ్ మెటీరియల్ తయారీ , ప్రీ-కంపోస్టింగ్ పద్ధతులు, నేల పురుగుల హ్యాండ్లింగ్ విధానాలు, తేమ స్థాయిని కొలిచి విధానం పై శిక్ష‌ణ అందించారు. ఈ మేర‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యం సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

Search
Categories
Read More
Gujarat
Gujarat Police Bust Mega ₹310 Crore Cyber Fraud Ring
Gujarat Police have successfully dismantled a massive cyber fraud network operating out of Gir...
By Tejaswini Komanduru 2026-06-15 08:01:32 0 210
Telangana
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము  ప్రతి గింజను కొనుగోలు...
By Gujile Ramu 2026-04-27 11:05:15 0 363
Andhra Pradesh
చంద్రబాబు- లోకేష్ తగిన మూల్యం చెల్లించుకునేంతవరకు వదిలిపెట్టను. -సమాజం తలదించుకునేలా రాష్ట్రంలో కూటమి పాలన. -ముద్రగడ కాపు జాతిలో పుట్టినందుకు జాతి యావత్తు గర్వపడాలి. -ముద్రగడ నివాసంలో వైసిపి నాయకులు అంబటి రాంబాబు.
కిర్లంపూడి,మార్చి 26:ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,మంత్రి నారా లోకేష్ తగిన మూల్యం...
By Nandika Jayababu 2026-03-26 16:29:27 0 416
Sikkim
Sikkim Embraces Mechanized Sanitation to End Scavenging
Sikkim has taken a major stride toward dignified sanitation by signing a landmark Memorandum of...
By Lokeshwari Panthadi 2026-07-02 08:18:33 0 68
Andhra Pradesh
పుంగనూరు: మొక్కలు నాటిన సబ్ కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, శుక్రవారం పుంగనూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అన్నమయ్య జిల్లా...
By Kothuru Murali 2026-06-05 13:19:57 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com