రైల్వే సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కార్యాచరణ

0
264

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా :   మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలలో ఒకటైన రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ని, హైదరాబాద్ డిఆర్ఎం శ్రీ సంతోష్ కుమార్ వర్మ ని, సికింద్రాబాద్ డిఆర్ఎం శ్రీ గోపాలకృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిసారు.

ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న రైల్వే RUB ల నిర్మాణం మరియు డ్రైనేజ్ సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. అధికారులు సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ప్రధాన అంశాలు:

1. వాజ్‌పాయి నగర్ RUB నిర్మాణానికి త్వరితగతిన చర్యలు

2. జనప్రియ అపార్ట్‌మెంట్స్ RUB అభివృద్ధి పనుల ప్రారంభం 

3. బొల్లారం రైల్వే బజార్ కొత్తబస్తీ బజార్ ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య

4. భుదేవి నగర్ సమీపంలో రైల్వే డ్రైనేజ్ సమస్య

5. మౌలాలి శ్రీనగర్ కాలనీ IALA పరిధిలో డ్రైనేజ్ సమస్య

6. ఆర్కే పురం ఫ్లై ఓవర్ నిర్మాణానికి డ్రాయింగ్స్ ఆమోదం కోసం విజ్ఞప్తి

7. భవానీనగర్ (141వ డివిజన్) లో డ్రైనేజ్ సమస్య పరిష్కారం

ఈ సమావేశంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి , బిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, జీకే హనుమంతరావు, అమీన్‌ఉద్దీన్, మేకల రాము యాదవ్, చిన్న యాదవ్, భాగ్యానందరావు, వంశీ ముదిరాజ్, రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు...
By Benguluri Madhubabu 2026-03-21 07:48:47 0 167
Andhra Pradesh
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.
Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు 24-01-2026 Sat 14:14 | Andhra  ...
By Pagadala Venkateswar 2026-01-24 09:48:07 0 216
Telangana
కాదంతోక్కి కదలిరండి..... జర్నలిస్టుల భద్రతే లక్ష్యం
రాష్ట్ర కన్వీనర్లు పర్కాల సమ్మయ్య గౌడ్,  బజ్జుర్ల శ్రీనివాస్. జనవరి 5న హైదరాబాద్ ఉప్పల్లో...
By CM_ Krishna 2025-12-29 03:57:57 0 259
Andhra Pradesh
రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వజ్జా శ్రీనివాసరావు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు...
By John Baji 2026-01-22 10:57:50 0 183
Andhra Pradesh
ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజల వద్ద నుంచి ఆర్జీలు స్వీకరిస్తున్న పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి
Breaking.. విజయవాడ    పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా దర్బార్ లో పాల్గొన్న MLA సుజనా...
By Rajini Kumari 2025-12-16 13:21:34 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com